Just In
- 57 min ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 17 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 19 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 22 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- Finance
Free Flight Tickets: ఉచితంగా 5 లక్షల విమాన టిక్కెట్లు.. మీకూ వెళ్లాలనుందా..?
- Lifestyle
Chanakya Niti: ఇవి అత్యంత శక్తివంతమైనవి.. ధనవంతులను చేస్తాయి, విజయవంతులనూ చేస్తాయి
- News
Air India: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. అత్యవసరంగా ల్యాండ్..
- Movies
Waltair Veerayya 3 Weeks Collections: వీరయ్య అరాచకం.. 3 వారాల్లో అన్ని కోట్లా.. చిరంజీవి పెను సంచలనం
- Sports
IND vs AUS: భారత స్పిన్ను చితక్కొట్టేందుకు ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఎయిర్టెల్కు భారీ షాకిచ్చిన ఆర్బిఐ
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్టెల్కు గట్టి షాక్ తగిలింది. ఈ కంపెనీకి చెందిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇకపై కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి వీలు లేదని ఆర్బీఐ తెలిపింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఖాతాదారుల రిజిస్ట్రేషన్లను ఆపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనికి ప్రధాన కారణం ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని తెలుస్తోంది. మార్చిలోనే ఈ సంస్థ 5 కోట్ల రూపాయల మేర భారీ జరిమానా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

కంపెనీపై దర్యాప్తు
ఈ ఉల్లంఘనపై ప్రస్తుతం కంపెనీపై దర్యాప్తు చేస్తున్నందున రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ విషయాన్ని ఎయిర్టెల్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.

జనవరి 5, 2018 నుంచి..
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం జనవరి 5, 2018 నుంచి కొత్త కస్టమర్లను తీసుకోవట్లేదు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను మేం అధికారులకు అందజేశాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని ఎయిర్టెల్ ప్రతినిధి తెలిపారు.

ఎలాంటి అనుమతి తీసుకోకుండానే
ఖాతాదారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వారి ఖాతాలు ప్రారంభించించింది. గత ఏడాది నవంబరు 20-22 తేదీల మధ్య ఆర్బీఐ నిర్వహించిన పరిశీలనలో ఈ విషయం తేలింది.

30 లక్షల ఖాతాలు
ఇలా దాదాపు 30 లక్షల ఖాతాలు తెరిచింది. ఆధార్తో నెంబర్ వెరిఫికేషన్ చేపట్టిన కస్టమర్లపై ఈ ప్రభావం పడింది. కేవలం ఖాతాలు తెరవడమే కాకుండా.. వంటగ్యాస్పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ లబ్ధిదారుల రెగ్యులర్ బ్యాంక్ ఖాతాల్లో కాకుండా తన పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుంది.

ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు
దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో, జనవరి 15న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ఖాతాదారుల అనుమతి లేకుండా
కేంద్ర బ్యాంకు సూచించిన మార్గదర్శకాలు పాటించకుండా.. ఖాతాదారుల అనుమతి లేకుండా ఎందుకు ఖాతాలు తెరిచారో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.

రూ.5 కోట్ల జరిమానా
బ్యాంకు ఇచ్చిన సమాధానం విన్న తరవాత రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ ఉల్లంఘన మీద కంపెనీపై దర్యాప్తు చేపడుతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470