Home
News

జియో దెబ్బకు 14 ఏళ్లలో మొదటిసారిగా కుప్పకూలిన ఎయిర్‌టెల్

By Gizbot Bureau

రిలయెన్స్ జియో దెబ్బకు టెలికామ్ కంపెనీలన్నీ విలవిలలాడుతున్నాయి. టాప్ పొజిషన్ లో ఉన్నా భారతీ ఎయిర్‌టెల్ కూడా నష్టాలబాట పట్టింది. జూన్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌కు భారీ నష్టాలొచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి రూ.2,866 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

airtel posts q1 net loss of rs 2866 crore first quarterly loss in 14 years

గత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ రూ.97 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 14 ఏళ్లలో మొదటిసారి కంపెనీ కన్సాలిడేటెడ్‌ నష్టాన్ని జూన్‌ త్రైమాసికంలో ప్రకటించింది. రిలయన్స్‌ జియో వంటి కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో కంపెనీకి నష్టాలు తప్పడం లేదు.

 రూ.19,799 కోట్ల నుంచి రూ.20,738 కోట్లకు

రూ.19,799 కోట్ల నుంచి రూ.20,738 కోట్లకు

సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రాబడి 4.7 శాతం వృద్ధితో రూ.19,799 కోట్ల నుంచి రూ.20,738 కోట్లకు పెరిగింది. జూన్‌ త్రైమాసికంలో దేశీయంగా ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చిన సగటు రాబడి (ఆర్పు) రూ.129గా ఉంది. మార్చి త్రైమాసికంలో ఇది రూ.123గా నమోదైంది.

14 సంవత్సరాల తర్వాత

14 సంవత్సరాల తర్వాత

దాదాపు 14 సంవత్సరాల తర్వాత తమకు వచ్చిన తొలి నష్టం ఇదని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.97 కోట్ల నికర లాభం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.107 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది.

జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్‌వర్క్‌ తరుగుదల

జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్‌వర్క్‌ తరుగుదల

రిలయన్స్‌ జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్‌వర్క్‌ తరుగుదల వ్యయాలు, భారీగా పన్ను వంటి అసాధారణ అంశాలతో ఈ క్యూ1లో ఈ స్థాయి లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.19,799 కోట్ల నుంచి 5% వృద్ధితో రూ.20,738 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత్‌లో ఆదాయం 3%, ఆఫ్రికాలో ఆదాయం 10% చొప్పున పెరిగాయని వివరించింది.

 94 శాతం పెరిగిన డేటా ట్రాఫిక్

94 శాతం పెరిగిన డేటా ట్రాఫిక్

మొబైల్‌ కంపెనీల కీలక పనితీరు అంశాల్లో ఒకటైన ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ-యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌) స్వల్పంగా పెరిగింది. గత క్యూ1లో రూ.123 గా ఉన్న ఏఆర్‌పీయూ ఈ క్యూ1లో రూ.129కు పెరిగిందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ 94 శాతం పెరిగిందని తెలిపింది.

 నిర్వహణ మార్జిన్‌ 6 శాతం పెరిగి 41 శాతానికి

నిర్వహణ మార్జిన్‌ 6 శాతం పెరిగి 41 శాతానికి

రూ. 8,493 కోట్ల నిర్వహణ లాభం సాధించామని, నిర్వహణ మార్జిన్‌ 6 శాతం పెరిగి 41 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ క్యూ1 ఫలితాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ(ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా) గోపాల్‌ విట్టల్‌ చెప్పారు. అన్ని వ్యాపారాల్లో సమ వృద్ధి సాధించామని తెలిపారు.

Best Mobiles in India

English summary
airtel posts q1 net loss of rs 2866 crore first quarterly loss in 14 years
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X