వోడాఫోన్ కి చెక్ పెట్టడానికి తన ప్లాన్ ను రివైజ్ చేసిన ఎయిర్టెల్
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వోడాఫోన్ కి గట్టిపోటినిస్తూ తన ప్లాన్లలో మార్పులను చేసింది. వోడాఫోన్ రూ.279కి పోటీగా తన పాత ప్లాన్ రూ.289లో మార్పులు చేసింది.
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వోడాఫోన్ కి గట్టిపోటినిస్తూ తన ప్లాన్లలో మార్పులను చేసింది. వోడాఫోన్ రూ.279కి పోటీగా తన పాత ప్లాన్ రూ.289లో మార్పులు చేసింది.ఈ మార్పు ద్వారా వినియోగదారులు వాలిడిటీ ఎక్కువరోజులు పొందుతారని కంపెనీ తెలిపింది. దీంతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ , ఎసెమ్మెస్ లాంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఎయిర్టెల్ రివైజ్ చేసిన ప్లాన్ పై ఓ లుక్కేయండి.

రూ. 399 ప్లాన్
ఇంతకు ముందు దీని వ్యాలిడిటీ 48 రోజుల వ్యాలిడిటీతో ఉంది. కాగా దీన్ని ఇప్పుడు 84 రోజుల వరకు వ్యాలిడిటీని ఇచ్చింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 84 రోజుల పాటు రోజుకు 4జిబి 3జి/4జి డేటాను పొందుతారు. అలాగే అపరిమిత లోకల్ , నేషనల్ కాల్స్ లభిస్తాయి. డైలీ 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి.

ఎంపిక చేసిన ఏరియాల్లోనే..
అయితే ఈ ప్లాన్లు కేవలం ఎంపిక చేసిన ఏరియాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా ,కేరళ,కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ప్లాన్ యూజర్లకి అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

వోడాఫోన్ కి గట్టి పోటీ
ఈ ప్లాన్ ఇప్పుడు వోడాఫోన్ కి గట్టి పోటీనివ్వనుంది.వోడాఫోన్ రూ.279 ప్లాన్ కూడా ఇదే రకమైన బెనిఫిట్స్ ని అందిస్తోంది. దీని వ్యాలిడిటీ మొత్తం 84 రోజులుగా ఉంది. అలాగే అపరిమిత లోకల్ , నేషనల్ కాల్స్ లభిస్తాయి.

జియో vs ఎయిర్టెల్
ఎయిర్టెల్ అందిస్తున్న రూ.289 ప్లాన్ జియో యొక్క రూ.399 ప్లాన్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే జియో రూ.399 ప్లాన్ లో రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది అలాగే అపరిమిత లోకల్ , నేషనల్ కాల్స్,రోజుకి 100 SMSలు లభిస్తాయి.


Click it and Unblock the Notifications







