రూటు మార్చిన ఎయిర్టెల్, డిజిటల్ కేవైసీతో పనిలేకుండా సిమ్ రిజిస్ట్రేషన్..
గత కొద్ది సంవత్సరాలుగా ఏదైనా కొత్త సిమ్ తీసుకోవాలంటే, ఆధార్తో లింక్ చేయబడిన eKYCని పూర్తి చేయవలసి ఉండేది.
కొద్ది సంవత్సరాలు నుంచి ఏదైనా కొత్త సిమ్ కొనాలి అనంటే , ఆధార్తో లింక్ చేయబడిన eKYCని పూర్తి చేయవలసి ఉండేది.అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధార్ కార్డు ఉపయోగ విషయంలో వెల్లడించిన తీర్పు ప్రకారం సిమ్ కార్డులకి ఆధార్ కార్డు తప్పనిసరి కాకపోవడంతో పరిస్థితిలో చాలా మార్పు వచ్చేసింది .టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, ఈ మేరకు దేశంలోని అన్ని టెలికాం కంపెనీలు కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాయి.

ఇందులో భాగంగానే తాజాగా ఎయిర్టెల్....
ఇందువల్ల తాజాగా ఎయిర్టెల్ సంస్థ ఆల్టర్నేటివ్ డిజిటల్ KYC విధానాన్ని సెలెక్టెడ్ టెలికాం సర్కిళ్లలో మొదటి ఫేస్ ను ప్రారంభించింది. దీన్ని దేశ వ్యాప్తంగా కూడా విస్తరింపజేస్తుంది.

కొత్తగా ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కొనుకోవాలి అంటే ....
ఇక నుంచి మీరు కొత్తగా ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కొనుకోవాలి అంటే , ఏదైనా అడ్రస్ ప్రూఫ్, ID ప్రూఫ్ని వెంట తీసుకు వెళితే, వాటిని
ఎయిర్టెల్ ప్రతినిధులు స్కానింగ్ చేసి డిజిటల్ రూపం లోకి కన్వర్ట్ చేసి, అప్పటికప్పుడు కస్టమర్ ఫోటో క్యాప్చర్ చేసి, నేరుగా ఆన్ లైన్ లో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫార్మ్ ని నింపటం ద్వారా ఆ వివరాలను సంస్థ ప్రధాన ఆఫీస్కి చేరవేస్తారు.

ఇక్కడ ఆధార్ కార్డు తప్పనిసరి కాకపోవడం....
ఇంతకముందు కూడా దాదాపు ఇదేలాగే జరిగినప్పటికీ, ఇక్కడ ఆధార్ కార్డు తప్పనిసరి కాకపోవడం గమనార్హం. మీ దగ్గర ఉన్న ఏదైనా ప్రూఫ్లను తీసుకొని వెళ్ళవచ్చు.

మిగతా టెలికం ఆపరేటర్లు....
మిగతా దిగ్గజ టెలికాం ఆపరేటర్లు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు . ప్రస్తుతానికి ఎయిర్టెల్ ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ టెలికాం సర్కిళ్లలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications








