జియో తరహాలో సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసిన ఎయిర్టెల్
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉంది.
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉంది. జియోకు పోటీగా మరో సరికొత్త ప్లాన్తో కస్టమర్ల ముందుకు వచ్చింది ఎయిర్టెల్ 398 రూపాయలతో ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ప్లాన్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లకు ఈ ఆఫర్ ప్రయోజనాలు అందుబాటులో ఉండనున్నాయి.ఈ ప్లాన్పై ఎలాంటి ప్రయోజనాలను ఎయిర్టెల్ అందిస్తుందంటే...

రూ.398తో రీఛార్జ్ చేసుకున్న వారికి...
రూ.398తో రీఛార్జ్ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటాను, 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు మాత్రమే .రీఛార్జ్ చేసుకున్న సమయం నుంచి వాయిస్ కాల్స్పై ఎలాంటి ఎఫ్యూపీ పరిమితి ఉండదు.

ఎయిర్టెల్ రూ.399 ప్లాన్...
ఎయిర్టెల్ గతంలో రూ.399 ప్లాన్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకున్న వినియోగదారుడికి అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు రోజూ 1.4 జీబీ డేటాను, 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు

జియో vs ఎయిర్టెల్
ఎయిర్టెల్ లాంచ్ చేసిన రూ.398 ప్లాన్ జియో యొక్క రూ.398 ప్లాన్ కు గట్టి పోటీ ఇవ్వబోతుంది.జియో రూ.398 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వినియోగదారుడికి అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు రోజూ 2 జీబీ డేటాను, 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 70 రోజులు మాత్రమే.

వోడాఫోన్ రూ.399 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 399 రోజులు. ఈ రూ.399 ప్లాన్ ను రీచార్జ్ చేసుకున్న వినియోగదారుడికి రోజుకి 1.4 జీబీ డేటా లభిస్తుంది .అయితే కాల్స్ వినియోగంలో కొన్ని పరిమితులు విధించింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం రోజువారీ 250 నిమిషాలు వాడుకునేలా నిబంధన విధించింది.

ఎయిర్టెల్ రూ.99,రూ.119 ప్లాన్...
ఎయిర్టెల్ తాజాగా రూ.99,రూ.119 ప్లాన్ ను రివైజ్ చేసింది.ఈ ప్లాన్లు రీఛార్జి చేసుకున్న వినియోగదారుడికి 2 జీబీ డేటా తో పాటు 300 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే.


Click it and Unblock the Notifications








