ఎయిర్టెల్ చేతికి ఎయిర్సెల్ 4జీ, ఇక దూకుడే
ఇక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్త్, ఒడిస్సా రాష్ట్రాల్లో ఎయిర్టెల్ 4జీ సేవలు మరింత ముమ్మరం కానున్నాయి.
ఎయిర్సెల్కు చెందిన 20MHz 4జీ స్పెక్ట్రమ్ను ఎయిర్టెల్ బుధవారం విజయవంతగా సొంతం చేసుకోగలిగింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. ఎయిర్సెల్ కంపెనీకి దేశవ్యాప్తంగా 8 టెలికం సర్కిళ్లలో 4జీ స్పెక్ట్రమ్ ఉంది.

Read More : రూ.50,000 వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
ఇప్పుడు ఈ స్పెక్ట్రమ్ను ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. డీల్ విజయవంతమవటంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్త్, ఒడిస్సా రాష్ట్రాల్లో ఎయిర్టెల్ 4జీ సేవలు మరింత ముమ్మరం కానున్నాయి.
డీల్ విజయవంతమవటంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్త్, ఒడిస్సా రాష్ట్రాల్లో ఎయిర్టెల్ 4జీ సేవలు మరింత ముమ్మరం కానున్నాయి. గతంలోనే ఎయిర్టెల్ వీడియోకాన్ వద్ద స్పెక్ట్రమ్ను కొనుగోలు చేసింది. ఆ వివరాలను పరిశీలించినట్లయితే.. ఐడియాతో డీల్ తెగతెంపులు చేసుకున్న తరువాత వీడియోకాన్ తన 6 సర్కిళ్లలోని 1800MHz స్పెక్ట్రమ్ను మార్చి 2016లో ఎయిర్టెల్కు విక్రయించింది . ఈ డీల్ విలువ రూ.4,428 కోట్లు. ఎయిర్టెల్ నెట్వర్క్ పరిధిని మరింతగా విస్తరించే క్రమంలో 700MHz స్పెక్ట్రమ్ను కూడా కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు ఎయిటెల్ ఇండియా సీఈవో గోపల్ విట్టల్ ఓ హింట్ కూడా ఇచ్చారు. అత్యంత ఖరీదైనదిగా పరిగణించబడుతోన్న 700MHz స్పెక్ట్రమ్ విలువ రూ. 4 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఓ అంచనా. రిలయన్స్ జియోతో పోటీ పడే క్రమంలో ఎయిర్టెల్ తన 4జీ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే 4జీ LTE నెట్వర్క్ను మార్కెట్లో లాంచ్ చేసి మంచి ఊపుమీదున్న రిలయన్స్ జియో అడ్వాన్సుడ్ నెట్వర్క్లో ఒకటైన LTE-Aను కూడా పరీక్షిస్తున్నట్లు సమాచారం. లేటెస్ట్ ల్యాప్టాప్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక మరింత దూకుడు..

వీడియోకాన్ నుంచి 1800MHz స్పెక్ట్రమ్.

భవిష్యత్ లో 700MHz స్పెక్ట్రమ్ కూడా..?

బలోపేతం దిశగా అడుగులు..

రేసులో జియో..


Click it and Unblock the Notifications








