ఏప్రిల్లో ఎయిర్టెల్ హవా!

న్యూఢిల్లీ: గత ఎప్రిల్లో దేశవ్యాప్తంగా జీఎస్ఎం కనెక్షన్ల సంఖ్య మరో 65 లక్షలకు పెరిగింది. దింతో ఏప్రిల్ ఆఖరు నాటికి మొత్తం జీఎస్ఎమ్ మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య 67.05 కోట్టకు చేరుకుంది. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) గణాంకాల ప్రకారం... కొత్త కనెక్షన్లలో అత్యధికంగా భారతీ ఎయిర్టెల్ ఖాతాలో 20 లక్షలు చేరగా వొడాఫోన్ 8.1 లక్షలు, ఐడియా సెల్యులార్ 14.8 లక్షలు, ఎయిర్సెల్ 10 లక్షలు, యూనినార్ 11.2 లక్షల కనెక్షన్లు పొందాయి.
తాజా గణాంకాలతో మొత్తం ఎయిర్టెల్ కనెక్షన్లు 18.32 కోట్లకు, వొడాఫోన్ సబ్స్క్రయిబర్స్ సంఖ్య 15.12 కోట్లకు, ఐడియా కనెక్షన్లు 11.42 కోట్లకు, ఎయిర్సెల్ యూజర్ల సంఖ్య 6.35 కోట్లకు, యూనినార్ కస్టమర్ల సంఖ్య 4.35 కోట్లకు చేరింది.సీవోఏఐ గణాంకాల్లో సీడీఎంఏ కనెక్షన్ల వివరాలు ఉండవు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ లెక్కల ప్రకారం సీడీఎంఏ కనెక్షన్లు కూడా కలుపుకుంటే మార్చ్ ఆఖరు నాటికి 91.91 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








