యూజర్లకి అదిరిపోయే శుభవార్తను అందించిన ఎయిర్టెల్
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రియలన్స్ జియోకి పోటీగా ఎయిర్టెల్ కూడా క్రికెట్ అభిమానుల కోసం అదిరిపోయే శుభవార్తను అందించింది.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రియలన్స్ జియోకి పోటీగా ఎయిర్టెల్ కూడా క్రికెట్ అభిమానుల కోసం అదిరిపోయే శుభవార్తను అందించింది. ఐపీఎల్ చూడాలనుకునే వారికి అద్బుత అవకాశాన్ని అందిస్తోంది. తన ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ కస్టమర్లకు ఉచితంగా లైవ్ ప్రసారాలు చూసే సౌకర్యాన్ని భారతి ఎయిర్టెల్ కల్పిస్తోంది. ఎయిర్టెల్ టీవీ యాప్ను కస్టమర్లు ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఐపీఎల్ మ్యాచ్లను లైవ్లో ఉచితంగా వీక్షించవచ్చని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్టెల్ టీవీ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్లకు అందుబాటులో ఉంది.

ఐపీఎల్ సందర్భంగా ఎయిర్టెల్ టీవీ యాప్లో ప్రత్యేకంగా క్రికెట్ కోసం ఓ సెక్షన్ను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్టెల్ వినియోగదారులు లైవ్ యాక్షన్ను అస్సలు మిస్ అయ్యే అవకాశం ఉండదు. అలాగే వినియోగదారులు తమకు నచ్చిన ఐపీఎల్ టీంలను ఫాలో అవుతూ ఆ టీం మ్యాచ్లను మిస్ కాకుండా చూడవచ్చు. అందుకు గాను నోటిఫికేషన్లు వచ్చేలా ఎయిర్టెల్ టీవీ యాప్ను తీర్చిదిద్దారు. అలాగే లైవ్లో జరిగే మ్యాచ్ల వివరాలను నోటిఫికేషన్ల రూపంలో పంపనున్నారు. ఈ ఫీచర్లు కావాలనుకుంటే ఎయిర్టెల్ కస్టమర్లు తమ ఎయిర్టెల్ టీవీ యాప్ను కొత్త వెర్షన్కు అప్డేట్ చేసుకోవాలి.
ఈ యాప్ను ఇప్పటికీ వాడని ఎయిర్టెల్ యూజర్లు తమ తమ డివైస్లలో నూతనంగా యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే దాంతో ఐపీఎల్ మ్యాచ్లను ఎయిర్టెల్ టీవీ యాప్లో ఉచితంగా వీక్షించవచ్చు. హాట్ స్టార్ సంస్థతో భాగస్వామ్యం అయిన ఎయిర్టెల్ ఈ సదవకాశాన్ని తన కస్టమర్లకు అందిస్తుందని ఆ సంస్థ కంటెంట్ అండ్ యాప్స్ సీఈవో సమీర్ బాత్రా వెల్లడించారు.
కాగా లేటెస్ట్ గా రూ.299తో Hotstar సబ్ స్క్రిప్సన్ తీసుకుంటే సంవత్సరం పాటు ప్రసారాలను వీక్షించనవచ్చని Hotstar ప్రకటించింది. cricket, football, tennis, Formula 1లు అలాగే ఇతర గేమ్స్ కి సంబంధించిన ప్రసారాలను ఎటువంటి అంతరాయం లేకుండా వీక్షించవచ్చు.


Click it and Unblock the Notifications