Just In
- 16 min ago OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 54 min ago ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- 1 hr ago గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- 3 hrs ago Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
Don't Miss
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ఖాతాదారులకు ఎయిర్టెల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది
దిగ్గజ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ తమ ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. ఇన్కమింగ్ కాల్స్ నిబంధనలను మార్చిన ఎయిర్టెల్.. ఇకపై ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఏడు రోజులు మాత్రమే ఇన్కమింగ్ కాల్స్ వస్తాయని ప్రకటించింది. ఇప్పటి వరకు ఇది 15 రోజులుగా ఉండగా, ఇప్పుడు దానిని సగానికి కుదించింది.
దీంతోపాటు ఎయిర్టెల్ మరో షాకింగ్ ప్రకటన కూడా చేసింది. తమ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత రీచార్జ్ చేసుకోకపోతే వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. యూజర్ల నుంచి వచ్చే సగటు రాబడి (ఏఆర్పీయూ)ని పెంచుకునే దిశగా ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
టెలికం విశ్లేషకులు ఆశ్చర్యం
ఎయిర్టెల్ నిర్ణయంపై టెలికం విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టెల్కో తాజా నిబంధనల వల్ల ఎయిర్టెల్ ఖాతాదారులు మరో నెట్వర్క్కు మారే (పోర్టబులిటీ) అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రిలయన్స్ జియో రాకతో కుదేలైన టెలికం కంపెనీలు తమ ఖాతాదారులు చేజారిపోకుండా ప్లాన్లు ప్రకటిస్తున్న సమయంలో ఎయిర్టెల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఖాతాదారులకు మింగుడుపడడం లేదు.
వొడాఫోన్ సంస్థ కూడా ఇదే నిర్ణయం
త్వరలోనే వొడాఫోన్ సంస్థ కూడా ఇదే నిర్ణయం తీసుకోబోతుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఎయిర్టెల్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ సంస్థకే చేటు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరింతమంది ఎయిర్టెల్ కస్టమర్స్ జియో వైపు మళ్లే అవకాశం ఉందంటున్నారు.
వింక్ మ్యూజిక్ యాప్ ద్వారా ఉచిత కాలర్ ట్యూన్స్
అయితే షాక్ ఇస్తూనే మరో శుభవార్తను అందించింది. జియో ఉచిత కాలర్ ట్యూన్స్ నేపథ్యంలో ఎయిర్టెల్ కూడా వారి కస్టమర్లకు ఉచితంగానే కాలర్ ట్యూన్స్ అందిస్తోంది. దీంతో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లు నచ్చిన పాటను కాలర్ ట్యూన్గా పెట్టుకోవచ్చు. ఎయిర్టెల్కు చెందిన యూజర్లు వింక్ మ్యూజిక్ యాప్ ద్వారా ఉచిత కాలర్ ట్యూన్స్ పొందొచ్చు. హెలో ట్యూన్స్ మార్చుకోవచ్చు. వింక్ యాప్లో 15 భాషలకు చెందిన 10 లక్షల పాటలు ఉన్నాయి.
వింక్ మ్యూజిక్ యాప్ను డౌన్లోడ్
యూజర్ల ఉచిత కాలర్ ట్యూన్ కావాలని భావిస్తే వింక్ మ్యూజిక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ ప్లేస్టోర్కు వెళ్లి ఇన్స్టాల్ చేసుకోండి. ఎయిర్టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్ యాప్ను ఓపెన్ చేయగానే ఉచిత హెలో ట్యూన్స్కు సంబంధించిన పాపప్ మెసేజ్ వస్తుంది. దీని సాయంతో ఫ్రీ కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. అలాగే కాలర్ ట్యూన్ మార్చుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470