Just In
- 13 hrs ago 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- 15 hrs ago Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- 15 hrs ago 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 17 hrs ago వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
Don't Miss
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇండియాలో 5G టెక్నాలజీ రాకతో మీ జీవితంలో కలిగే అద్భుతమైన మార్పులు
అల్ట్రా హై-స్పీడ్ ఇంటర్నెట్తో సహా 5G టెలికాం సేవలను అందించగల ఎయిర్వేవ్ల వేలానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కారణంతో టెలికాం సంస్థలు అన్ని కూడా 5G నెట్వర్క్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాయి. ఇండియాలో త్వరలోనే 5G సేవలు సేవలు అందుబాటులోకి రానున్నడంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G కంటే దాదాపు 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ ని పొందవచ్చు. 5G దేశంలో పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తరువాత దేశం యొక్క ఆర్థిక వృద్ధి తదుపరి స్థాయికి తీసుకొనిపోవడానికి సహాయపడుతుంది. 5G ఆవిష్కరణతో మొమెంటం పనితీరు, ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్వర్క్ స్లైసింగ్ మరియు సెక్యూరిటీ వంటి విభిన్న సామర్ధ్యాలు పెరగనున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
భారతదేశంలోని సర్వీస్ ప్రొవైడర్లు ప్రారంభించే 5G సర్వీసులతో దేశంలో డిజిటలైజేషన్ ఆదాయాల అంచనా విలువ 2030 నాటికి సుమారు USD 17 బిలియన్లకు చేరుకుంటుంది అని భావిస్తున్నార. 5G వృద్ధిని నిర్వహించడానికి ఆపరేటర్లను ఇప్పుడు పూర్తిగా అనుమతించనున్నది. వినియోగదారుల డేటా అవసరాలు మరింత సమర్ధవంతంగా ఉండడమే కాకుండా వారి కోసం కొత్త కొత్త ఆదాయ మార్గాలను తెరవడంలో కూడా సహాయపడతాయి.
5G అందుబాటులోకి రావడంతో ప్రపంచంతో మరింత స్మార్ట్ గా కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. 5G యొక్క ప్రారంభ దశలలో మెరుగైన మొబైల్ బ్రాడ్బ్యాండ్ (eMBB) మరియు ఫిక్సడ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) వంటి వినియోగ సందర్భాలను చూడవచ్చు. భారతదేశంలో స్థిర బ్రాడ్బ్యాండ్ వ్యాప్తి సమస్యను పరిష్కరించడంలో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు వినియోగదారుల డేటా అనుభవాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. పెరుగుతున్న డేటా అవసరాలను మరింత ప్రభావవంతంగా తీర్చడంలో 5G కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇది సహాయంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం 5G అందుబాటులోకి వచ్చిన తరువాత గిగాబైట్ ధర ప్రస్తుత 4G కంటే 10 రెట్లు తక్కువగా ఉంటుంది అని ఇండియా హెడ్-నెట్వర్క్స్, మార్కెట్ ఏరియా సౌత్-ఈస్ట్ ఆసియా, ఓషియానియా మరియు ఇండియా ఎరిక్సన్లో మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ బన్సల్ తెలిపారు.
5G అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారులు వారి స్మార్ట్ఫోన్లలో 4K వీడియోను వీక్షించడాన్ని, AR/VR మొబైల్ గేమింగ్ యాప్లు మరియు అనేక ఇతర లీనమయ్యే కార్యకలాపాలు మరియు కొత్త అప్లికేషన్లను మరింత మెరుగ్గా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. సెక్యూరిటీ నుండి వినోదం వరకు అన్ని రకాల ప్రమాణాలు అంతకు మించివ అనుభవంతో అన్ని రకాల ప్రయోజనాలను అందివ్వనున్నట్లు 5G వాగ్దానం చేస్తుంది.
5G రాకతో వినియోగదారులు ఉపయోగించే డేటా యొక్క డౌన్లోడ్ రేట్లలో రూపాంతరం చెందుతుంది. స్పెక్ట్రమ్ యొక్క మూడు రెట్ల అధిక సామర్థ్యం మరియు అతి తక్కువ జాప్యంతో పాటుగా తరువాతి తరం టెక్నాలజీలు వ్యాప్తి చెందుతాయి. ఒప్పో సంస్థ తన యొక్క వినియోగదారులకు తన అనేక 5G పరికరాలతో అతుకులు లేని మరియు సూపర్కంప్యూటింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది అని ఒప్పో ఇండియా VP మరియు R&D హెడ్ తస్లీమ్ ఆరిఫ్ పేర్కొన్నారు.
5G రాక కోసం భారతీయ వినియోగదారులు అధిక ఆసక్తితో ఉన్నారు. 5G తీసుకువచ్చే అధిక సామర్థ్యాల కోసం వారు ప్రీమియం మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కన్స్యూమర్ ల్యాబ్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో కనీసం 40 మిలియన్ల మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు 5G అందుబాటులోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తీసుపోవడానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నారు. నిజానికి వారు 5G కనెక్టివిటీకి కేవలం 10 శాతం మాత్రమే అధికంగా చెల్లించే అవకాశం ఉంది. ప్రస్తుతం బండిల్ చేయబడిన డిజిటల్ సేవల యొక్క 5G ప్లాన్ల కోసం 50 శాతం ఎక్కువ చెల్లించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. కొన్ని నివేదికల ప్రకారం 5G నెట్వర్క్ 2027 చివరి నాటికి భారతదేశంలో 39 శాతం మొబైల్ సబ్స్క్రిప్షన్లను సూచిస్తూ దాదాపు 500 మిలియన్ సబ్స్క్రిప్షన్లుగా ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేయబడింది.
5G యొక్క దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 8 గా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ దరఖాస్తుదారుల జాబితాను జూలై 12న బహిరంగంగా ప్రకటించనున్నారు. స్పెక్ట్రమ్ యొక్క మాక్ వేలం జూలై 22 మరియు జూలై 23న జరుగుతుంది. అదే రోజున DoT ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్ను కూడా నిర్వహిస్తుంది. కాన్ఫరెన్స్ యొక్క వేదిక మరియు తేదీ/సమయం వివరాలను ప్రత్యేకంగా DoT వెబ్సైట్లో తెలియజేయబడుతుంది.
20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్ని జూలై22, 2022 న వేలం వేయబడుతుంది. స్పెక్ట్రమ్ కోసం వేలం వివిధ తక్కువ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మిడ్ (3300 MHz) మరియు హై (26 GHz) ఫ్రీక్వెన్సీ బ్యాండ్లుగా విభజించబడింది. ప్రస్తుత 4G సేవల ద్వారా సాధ్యమయ్యే దానికంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ వేగంతో అందించగల సామర్థ్యం ఉన్న 5G టెక్నాలజీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మిడ్ మరియు హై బ్యాండ్ స్పెక్ట్రమ్ను ఉపయోగించుకుంటారని భావిస్తున్నారు.
కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G పర్యావరణ వ్యవస్థ ఇప్పుడు 5G దేశీయ అభివృద్ధికి దారితీస్తోంది. భారతదేశంలోని ఎనిమిది టాప్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లలో 5G టెస్ట్ బెడ్ సెటప్ భారతదేశంలో దేశీయ 5G టెక్నాలజీని ప్రారంభించడాన్ని వేగవంతం చేస్తోందని ప్రభుత్వం పేర్కొంది. అదనంగా మొబైల్ హ్యాండ్సెట్లు, టెలికాం డివైస్ల కోసం PLI (ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్స్) స్కీమ్ మరియు ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించడంతో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించేందుకు బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు.
భారతదేశం డిజిటల్ సూపర్ పవర్గా అభివృద్ధి చెందడానికి 5G కీలక పాత్ర పోషిస్తుంది. కమర్షియల్ లాంచ్లో ఆలస్యం కావడం వల్ల అది సృష్టించగల ప్రభావాన్ని ప్రభావితం చేయకుండా మమ్మల్ని గణనీయంగా దూరంగా ఉంచుతోంది. 5G ఎకోసిస్టమ్లో నాన్-టెల్కోస్ భాగస్వామ్యం ఇన్నోవేషన్ను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా కనెక్ట్ చేయబడిన మరియు స్మార్ట్ లివింగ్ కోసం కేస్ డెవలప్మెంట్ను ఉపయోగిస్తుంది అని మార్కెట్ ప్రధాన విశ్లేషకుడు మరియు techARC వ్యవస్థాపకుడు ఫైసల్ కవూసా తెలిపారు.
5G నెట్వర్క్లలో మొదటిసారి విజయవంతమైన బిడ్డర్లు ముందస్తు పేమెంట్ చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం వేలం ప్రకారం స్పెక్ట్రమ్ యొక్క పేమెంట్లను 20 సమాన వార్షిక వాయిదాలలో ప్రతి సంవత్సరం ప్రారంభంలో చెల్లించవచ్చు. ఈ చర్యతో నగదు అవసరాలను గణనీయంగా తగ్గించడంతో పాటుగా ఈ రంగంలో వ్యాపార వ్యయాన్ని కొద్ది శాతం అయినా కూడా తగ్గించవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. బిడ్డర్లకు 10 సంవత్సరాల తర్వాత బ్యాలెన్స్ ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి భవిష్యత్తు బాధ్యతలు లేకుండా స్పెక్ట్రమ్ను సరెండర్ చేసే అవకాశం ఇవ్వబడుతుంది. ఇండియాలో 5G రోల్అవుట్ను మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం మరియు పరిశ్రమలు రెండు కూడా ఒకరికి ఒకరు సహకరించాలని ప్రధాని మోడీ కోరారు. 5G రోల్ అవుట్ అందుబాటులోకి వచ్చిన తరువాత వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు మరియు మరిన్ని రంగాలకు మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం లభిస్తుంది. 5G సాయంతో అనేక సాంకేతికతలలో వారి ఉత్పత్తులు, పరిష్కారాలు మరియు నమూనాలను ధృవీకరించడానికి టెలికాం పరిశ్రమ ఈ రంగంలో ఉన్న స్టార్టప్లకు ఇది మద్దతు ఇస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470