అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019.... వీటి మీద ఆఫర్లే ఆఫర్లు
ఇండియాలో బాగా పాపులర్ అయిన ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్. ఈ రెండు సంస్థలు ప్రతి సారి తమ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఏవో ఒక సేల్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఫ్లిప్కార్ట్ తన ప్లాట్ఫామ్లో 'ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019' ను డిసెంబర్ 21 నుండి మొదలు పెట్టనున్నది. దీనికి పోటీగా రెండు రోజుల ముందుగా అంటే ఈ రోజు డిసెంబర్ 19 నుండి "అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019"ను ప్రకటించింది.

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ఇయర్ ఎండ్ సేల్
5 రోజుల పాటు డిసెంబర్ 19 నుంచి 23 వరకు 'అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019' అనే పేరుతో జరగనుంది. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు డిసెంబర్ 18 రాత్రి 12 గంటల నుంచే ప్రారంభం అయింది. ఈ మూడు రోజుల పాటు ఫ్లిప్కార్ట్ లో జరిగే ఈ సేల్స్ సందర్బంగా స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్ వంటి అన్ని కేటగిరీల మీద భారీ మొత్తంలో డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటించింది .

ఇండియాలో బాగా పాపులర్ అయిన శామ్సంగ్, షియోమి, వన్ ప్లస్ ,ఒప్పో,ఐఫోన్,హానర్,నోకియా,వంటి బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై 40% గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో కొత్తగా రిలీజ్ అవుతున్న ఫోన్లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటించింది. వీటితో పాటుగా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 70% వరకు తగ్గింపును అందిస్తున్నది. ఈ డిస్కౌంట్స్ యొక్క మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అమెజాన్ యొక్క వెబ్సైట్లో చూడవచ్చు.

బ్యాంక్ ఆఫర్స్
అమెజాన్ యొక్క ఈ సేల్స్ ద్వారా షియోమి యొక్క రెడ్మి నోట్ 8,రెడ్మి నోట్ 8 ప్రో వంటి స్మార్ట్ఫోన్ల కొనుగోలు మీద ఐసీఐసీఐ బ్యాంక్ యొక్క క్రెడిట్,డెబిట్ కార్డు మీద రూ.1,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే వన్ ప్లస్ స్మార్ట్ఫోన్ల మీద రూ.10,000 వరకు తగ్గింపు అందించడంతో పాటుగా HDFC బ్యాంక్ క్రెడిట్,డెబిట్ కార్డు మీద రూ.3,000 వరకు ఇంస్టెంట్ తగ్గింపు లభిస్తుంది. శామ్సంగ్ మొబైల్స్ మీద రూ.3,500 వరకు తగ్గింపు అందించడంతో పాటుగా యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ మీద రూ.750ల వరకు ప్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఒప్పో A9 2020 క్విజ్
అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019 సందర్బంగా ప్రతి రోజు ఒప్పో A9 2020 క్విజ్ పోటీ జరగనున్నది. ఇందులో వారు అడిగే సమాధానాలకు సరైన సమాదానాలు పంపిన వారికి వారు ఊహించని బహుమతులు పొందవచ్చు.

స్మార్ట్ఫోన్ ఆఫర్స్
--- వన్ ప్లస్ 7T ఫోన్ మీద ఇప్పుడు రూ.3,000 తగ్గింపును అందించడంతో పాటుగా HDFC కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇప్పుడు దీని యొక్క ధర రూ.34,999. దీని ఒరిజినల్ ధర రూ.37,999.
--- కొత్తగా రిలీజ్ అయిన షియోమి యొక్క రెడ్మి నోట్ 8 ప్రో యొక్క మొదటి సేల్ ఈ రోజు 12:00 కి మొదలుకానున్నది. దీని యొక్క ధర రూ.14,999. దీనిని ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా గొప్ప డిస్కౌంట్స్ లబిస్తాయి.
---- ఇవే కాకుండా తక్కువ బుడ్జెక్ట్ లో వివిధ రకాల స్మార్ట్ఫోన్ల మీద గొప్ప తగ్గింపులను అందిస్తున్నది. వీటితో పాటుగా హెడ్ సెట్ , ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్ వంటి వాటి మీద కూడా 70% వరకు తగ్గింపును అందిస్తున్నది.


Click it and Unblock the Notifications








