అమూల్ మొట్టమొదటి పాల ఏటీఎమ్ ప్రారంభం!

ప్రముఖ పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్ ఏటీఎమ్ (ఎనీ టైం మిల్క్) పేరుతో దేశంలోనే మొట్టమొదటి పాల ఎటీఎమ్ కేంద్రాన్ని గుజరాత్లోని ఆనంద్ టౌన్లో ప్రారంభించింది. ఏటీఎమ్ తరహాలో తీర్చిదిద్దబడిన ఈ ఆధునిక పాల కేంద్రం 24x7 రోజులు పనిచేస్తుంది. అమూల్ పాల ఏటీఎమ్లు త్వరలో మరిన్ని పట్టణాలకు విస్తరించనున్నాయి. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రూపొందించబడిన ఈ పాల మెచీన్లలో రాత్రుళ్లు సైతం పాలు లభిస్తాయి.
ఈ ఎటీఎమ్ మెచీన్ల ద్వారా 300ఎమ్ఎల్ సామర్ధ్యం కలిగి పాల ప్యాకెట్లను రూ.10కు విక్రయిస్తున్నారు. ఈ ఏటీఎమ్ ఆవిష్కరణ సందర్భంగా అమూల్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్లో మరిన్ని పాల ఏటీఎమ్ కేంద్రాలను నెలకొల్పుతామని ఆయా ఏటీఎమ్ కేంద్రాల వద్ద ఇతర పాల ఉత్పత్పులను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








