Online Rummy ని బ్యాన్ చేసిన ఆంధ్ర గవర్నమెంట్!!! ఆడితే జైలుకే
యువతను తప్పుడు మార్గంలోకి నెట్టివేస్తున్న ఆన్లైన్ గేమ్ లను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఆన్లైన్ లో ఎక్కువ మంది ఆడుతున్న పేకాట "రమ్మీ" ని నిషేదిస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే ఎవరైనా రమ్మీ పేకాటను ఆన్లైన్ లో ఆడితే కనుక శిక్షార్హులు అవుతారు అని కూడా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆన్లైన్ గేమ్ లను నిషేధించాలని
యువతను తప్పుడు మార్గంలోకి నెట్టివేస్తున్న ఆన్లైన్ గేమ్ లను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఆన్లైన్ లో ఎక్కువ మంది ఆడుతున్న పేకాట "రమ్మీ" ని నిషేదిస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే ఎవరైనా రమ్మీ పేకాటను ఆన్లైన్ లో ఆడితే కనుక శిక్షార్హులు అవుతారు అని కూడా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆన్లైన్ లో జూదంను ప్రోత్సహించే గేమ్ లను నిషేధించే నిర్ణయం తీసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీని యొక్క విషయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పెర్ని వెంకటరామయ్య (నాని) పత్రిక సమావేశంలో అధికారికంగా తెలిపారు.

ఆంధ్రాలో ఆన్లైన్ రమ్మీ బ్యాన్
కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పెర్ని వెంకటరామయ్య (నాని) ఆన్లైన్ జూదం అనేది యువతను తప్పుదారి పట్టిస్తున్నది. ఇప్పటికే దీని ద్వారా దెబ్బతిన్న వారు చాలా మందే ఉన్నారు. ఆన్లైన్ జూదం అనేది ఒక వైరస్ లాగా వ్యాప్తి చెందుతుంది. కావున దీనిని నివారించడానికి దీనిని బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఆన్లైన్ జూదం ఆడినవారికి శిక్షలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆన్లైన్ జూదం నిర్వాహకులకు జరిమానా విధించడంతో పాటు మొదటిసారి చేసిన నేరానికి ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా విధించబడుతుంది అని తెలిపారు. కావున ఇప్పటి నుంచి ఎవరు కూడా ఆన్లైన్ లో జూదంను ఆడరాదని కూడా సూచించారు.


Click it and Unblock the Notifications