బెంగుళూరు రహదారుల పై ఉచిత ‘నమ్మా వై-ఫై’ సేవలు!
బెంగుళూరు వాసులకు శుభవార్త.. నగరంలోని ఎంజి రోడ్, బ్రిగేడ్ రోడ్ ఇంకా నాలుగు ఇతర ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఉచిత వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టువిటీ సేవలు ప్రారంభం కానున్నాయి. ‘నమ్మా వై-ఫై'(‘Namma Wifi') పేరుతో ప్రారంభించబడుతున్న ఈ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ను దేశంలో ప్రారంభించటం ఇదే మొదటిసారి.

ఆయా అనుకూల ప్రాంతాల (హాట్స్పాట్ల) వద్ద ఉచిత వై-ఫైను యాక్సిస్ చేసుకోదలచిన వారు ముందుగా తమ డివైస్లోని బ్రౌజర్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వెనువెంటనే ‘నమ్మా వైఫై' పేజీకి సదరు బ్రౌజర్ మరల్చబడుతుంది. వై-ఫైను యాక్సిస్ చేసుకునే క్రమంలో మీ మొబైల్ ఫోన్కు ఓ పాస్వర్డ్ పంపబడుతుంది. ఆ పాస్వర్డ్ ఆధారంగా రోజు మొత్తం మీద 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే అవకాశాన్నీ మీకు కల్పిస్తారు. హాట్స్సాట్ల వద్ద ఇంటర్నెట్ వేగం 512కేబీపీఎస్గా ఉండొచ్చని తెలుస్తోంది.
నమ్మా ఉచిత వై-ఫై సర్వీసులు నగరంలోని శాంతినగర్, యశ్వంతపూర్, కోరమంగలా, ఇందిరానగర్ ప్రాంతాల్లోని ట్రాఫిక్ ఇంకా ట్రాన్స్మిట్ మేనేజిమెంట్ సెంటర్స్ (టీటీఎంసీలు)లోనూ శుక్రవారం నుంచే ప్రారంభం కానున్నాయి.
రానున్న నెలల్లో నమ్మా వై-ఫై సర్వీసులను మైసూర్, మంగళూరు, హుబ్లి-దార్వాడ్ ఇంకా ఉత్తర కర్ణాటకలోని పలు పట్టణాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో భాగంగా బెంగుళూరు రాష్ట్ర సర్కారు, D-VoiS అనే ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్తో ఒప్పందాన్ని కదుర్చుకుంది. బెంగుళూరులోని మరో 10 ప్రాంతాలకు ఈ నమ్మా వై-ఫై సేవలను విస్తరించనున్నట్లు సమాచారం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








