ఇంటర్నెట్కు చీకటి రోజు?

సమస్త నెట్ ప్రపంచం ఆందోళనకు లోనవుతున్న ఆ చికటి రోజు రానే వచ్చింది. భారత్ సహా పలు దేశాల్లో ‘డీఎన్ఎస్ ఛేంజర్’ అనే ప్రమాదకర వైరస్ భారినపడ్డ వేలాది కంప్యూటర్లు సోమవారం నుంచి ఇంటర్నెట్ సేవలు కొల్పోయే అవకాశం ఉందని ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ ‘మెకాఫీ’ వెల్లడించింది.
గత ఏడాది డీఎన్ఎస్ చేంజర్ వైరస్ విజృంభించడంతో కొన్ని సర్వర్లను అమెరికా మూసివేసింది. వైరస్ సోకిన కంప్యూటర్లను సరిచేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే తాత్కాలిక సర్వర్ల కాలపరిమితి వచ్చే సోమవారం ముగుస్తుండటంతో అధికారులు వాటిని షట్డౌన్ చేయ్యనున్నారు. ఫలితంగా ‘డీఎన్ఎస్ ఛేంజర్’ కలిగిన కంప్యూటర్లు ఇంటర్నెట్ అనుసనంధానాన్ని కోల్పోయే అవకాశం ఉన్నట్లు మెకాఫీ వివరించింది.
ఇదిలా ఉండగా.. అమెరికా, ఇటలీ తర్వాత అత్యధిక డీఎన్ఎస్ ఛేంజర్ల భారినపడ్డ దేశం భారత్ అని మెకాఫీ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. భారత్ లో 50వేల కంప్యూటర్లు ఈ ప్రమాదకర వైరస్ భారినపడినట్లు ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ట్ టీం’ అధికారి తెలిపారు.


Click it and Unblock the Notifications








