Home
News

BSNL 4G: 4G స్పెక్ట్రంను అందుకున్న BSNL... త్వరలోనే ప్రారంభం...

ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) త్వరలో 4G విస్తరణను ప్రారంభించనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా బిఎస్‌ఎన్‌ఎల్‌కు 4G స్పెక్ట్రం కేటాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

బిఎస్‌ఎన్‌ఎల్‌ 4G స్పెక్ట్రం

ఏప్రిల్ 1 నుండి బిఎస్‌ఎన్‌ఎల్‌కు 4G స్పెక్ట్రం కేటాయించబడుతుంది మరియు 4G టెక్నాలజీ 19 నెలల్లో అమలు చేయబడుతుంది అని టెలికాం రాష్ట్ర మంత్రి సంజయ్ షమరావ్ ధోత్రే పార్లమెంటుకు తెలియజేశారు.

 

 

బిఎస్‌ఎన్‌ఎల్ మరియు ఎమ్‌టిఎన్‌ఎల్‌

బిఎస్‌ఎన్‌ఎల్ మరియు ఎమ్‌టిఎన్‌ఎల్‌

బిఎస్‌ఎన్‌ఎల్ మరియు ఎమ్‌టిఎన్‌ఎల్‌లు ఎప్పటికి మూసివేయబడవు. కేంద్రం యొక్క నిధులతో టెలికాం ఆపరేటర్‌ను పునరుద్ధరించే ప్రణాళికలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు హామీ ఇచ్చిన తరువాత ఈ అభివృద్ధి మొదలైంది. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడటానికి బిఎస్‌ఎన్‌ఎల్ ఇండియాలో 4G సేవలను ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది.

 

BSNL,MTNL లు ఇండియా స్ట్రాటజిక్ ఆస్తులు

BSNL,MTNL లు ఇండియా స్ట్రాటజిక్ ఆస్తులు

టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిఎస్ఎన్ఎల్ మరియు ఎంటిఎన్ఎల్ భారతదేశ వ్యూహాత్మక ఆస్తులు. ఇవి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు చాలా వరకు సహాయం చేశారని చెప్పారు. అటువంటి వాటిని పునరుద్ధరించడానికి ప్రణాళికలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నారు. "BSNL మరియు MTNL మూసివేయబడతాయి అనే అభిప్రాయంలో ఉండకండి. మేము వాటిలో పునరుజ్జీవన ప్యాకేజీని చొప్పించాము మరియు ఈ కంపెనీలు మూసివేయబడవని నేను మీకు భరోసా ఇస్తున్నాను "అని ప్రసాద్ ప్రశ్న సమయంలో ప్రశ్నలకు సమాధానమిస్తూ అన్నారు.

 

 

బిఎస్ఎన్ఎల్ టవర్ ఆస్తులు

బిఎస్ఎన్ఎల్ టవర్ ఆస్తులు

బిఎస్ఎన్ఎల్ యొక్క పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా ఈ సంస్థల యొక్క వనరులు మరియు ఇతర ఆస్తులను సముచితంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. మౌలిక సదుపాయాల భాగస్వామ్యాన్ని అనుమతించే ప్రభుత్వ విధానం ప్రకారం బిఎస్ఎన్ఎల్ మరియు ఎంటిఎన్ఎల్ రెండూ తమ టవర్లను ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పంచుకోవడం ద్వారా తమ టవర్ ఆస్తుల ద్వారా కొంత మొత్తంలో డబ్బును ఆర్జించాయి.

 

 

టవర్లను

టవర్లను తమ సొంత వ్యాపారం కోసం ఉపయోగించడంతో పాటు బిఎస్ఎన్ఎల్ మరియు MTNL టవర్లు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో మరియు వోడాఫోన్-ఐడియాకు లీజుకు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా రెండు కంపెనీలు ఇతర కంపెనీల నుండి అద్దెకు తీసుకున్న టవర్లను కూడా ఉపయోగిస్తాయి.

 మొబైల్ టవర్లు

మొబైల్ టవర్లు

బిఎస్‌ఎన్‌ఎల్ షేర్ చేసిన వివరాల ప్రకారం ఇండియా మొత్తం మీద ఉన్న 13,416 మొబైల్ టవర్లలో రిలయన్స్ జియోతో 8,363, భారతి ఎయిర్‌టెల్ తో 2,779 మరియు వొడాఫోన్ ఐడియాతో 1,782 మొబైల్ టవర్లను పంచుకున్నాయి. MNTL యొక్క 402 మొబైల్ టవర్లలో కూడా జియోతో 137, ఎయిర్‌టెల్ తో 100 మరియు వొడాఫోన్-ఐడియాతో 165 టవర్లను షేర్ చేసుకున్నాయి. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ మరియు ఎమ్‌టిఎన్‌ఎల్‌కు రూ.167.97 కోట్లు, రూ.11.62 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి తెలిపారు. డబ్బును తిరిగి పొందడానికి ప్రభుత్వం చురుకుగా సంస్థను అనుసరిస్తోంది.

BSNL VRS ప్రాసెస్‌

BSNL VRS ప్రాసెస్‌

జనవరి 31, 2020 న 80,000 మందికి పైగా ఉద్యోగులు సామూహికంగా బిఎస్ఎన్ఎల్ నుండి పదవీ విరమణ చేశారు. ఇది బిఎస్ఎన్ఎల్ నిధులను నిల్వ చేయడానికి మరియు రాబోయే సంవత్సరాల్లో వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఉన్న 3G స్పెక్ట్రంను ఉపయోగించి ఎంచుకున్న సర్కిళ్లలో 4G సేవలను అందిస్తోంది. అయితే పూర్తి స్థాయి 4G లాంచ్ విషయాలు మరింత మెరుగ్గా చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL 4G Spectrum Starting April 1
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X