బిఎస్ఎన్ఎల్ న్యూ ఆఫర్, ఈ రోజే లాస్ట్..
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ సందర్భంగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది.
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ సందర్భంగా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రూ.74 సరికొత్త ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.74తో రీచార్జి చేసుకుంటే రోజూ 1జీబీ 3జీ డేటా లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్లు వస్తాయి.

దీంతోపాటు రూ.10 టాక్టైం వస్తుంది. అయితే ఈ ప్లాన్ ద్వారా వాయిస్ కాల్స్ రావు. కానీ 31, 1వ తేదీల్లో ఈ ప్లాన్ ద్వారా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. బ్లాక్ అవుట్ డేస్ వర్తించవు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం 3 రోజులు మాత్రమే. అది కూడా న్యూ ఇయర్ సందర్భంగానే ఈ ప్లాన్ను బీఎస్ఎన్ఎల్ విడుదల చేసింది. కాగా జనవరి 1వ తేదీ తరువాత ఈ ప్లాన్ మళ్లీ లభించదు.


Click it and Unblock the Notifications