బీఎస్ఎన్ఎల్ స్సెషల్ ఆఫర్స్!

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) నాలుగు సరికొత్త టారిఫ్ ప్లాన్ లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఎంపిక చేసుకోవటం ద్వారా లోకల్ కాల్స్ కు సంబంధించి నిమిషానికి 20పైసలు మాత్రమ్ చార్జ్ చేస్తారు. స్పెషల్ టారిఫ్ ల వివరాలు.
లోకల్ కాల్స్......
ఎస్ టీవీ రూ.39 (వ్యాలిడిటీ సమయం 30 రోజులు),
ఎస్ టీవీ రూ.107 (వ్యాలిడిటీ సమయం 90 రోజులు) ,
ఎస్టీడీ కాల్స్.....
ఎస్టీవీ రూ.43 (వ్యాలిడిటీ సమయం 30 రోజులు),
ఎస్టీవీ రూ.111 (వ్యాలిడిటీ సమయం 90 రోజులు).
బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్లను తొలిగా కోల్కతా సర్కిల్లో ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని యూజర్లు ఈ స్పెషల్ టారిఫ్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం బీఎస్ఎన్ఎల్ షోరూమ్ లేదా కస్టమర్ కేర్ సపోర్ట్ను సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా 2జీ ఇంకా 3జీ వైర్లెస్ ఇంటర్నెట్ మోడమ్లపై రూ.300ను అదనంగా బీఎస్ఎన్ఎల్ చార్జ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








