BSNL ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉచితం
ల్యాండ్లైన్ ఫోన్లను, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ను ఉచితంగా అమరుస్తామని (ఇన్స్టాలేషన్) BSNL వెల్లడించింది.
ల్యాండ్లైన్ ఫోన్లను, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ను ఉచితంగా అమరుస్తామని (ఇన్స్టాలేషన్) BSNL వెల్లడించింది. కొత్త యూజర్లను ఆకర్షించేందుకు, అలాగే వైర్లైన్ సేవల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపేందుకు ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, ఎఫ్టీటీహెచ్లపై ఇన్స్టాలేషన్ రుసుంను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం కొత్తగా ల్యాండ్లైన్ కనెక్షన్ ఇస్తే రూ.600, బ్రాడ్బ్యాండ్కైతే రూ.850 చొప్పున రుసుం వసూలు చేస్తోంది. నిన్నటి నుంచే రుసుం రద్దు వరిస్తుందని, తదుపరి ప్రకటన చేసే వరకు అమల్లో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.
దీంతో పాటు రూ.675 లేదా అంతకుమించిన నెల అద్దె బ్రాడ్బ్యాండ్ ప్లాన్పై వైఫై మోడమ్ను కొనుగోలు చేస్తే 100 శాతం క్యాష్బ్యాక్ను కూడా పొందొచ్చు. మోడమ్ ధర రూ.1500 కాగా 30 నెలల్లో రూ.50 చొప్పున తిరిగి ఇస్తామని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

అల్ట్రా-ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులను
జియో నుంచి త్వరలో పైబర్ బ్రాండ్ వస్తున్న నేపథ్యంలో తన స్పీడ్ ను పెంచుకునేందుకు జియో కసరత్తు చేస్తోంది.ఇందుకోసం తాజాగా అల్ట్రా-ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులను ఆవిష్కరించింది. దీని కోసం సంస్థ తన నెట్వర్క్ను నెక్స్ట్ జనరేషన్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసుకుంది.

1జీబీపీఎస్ టాప్ డౌన్లోడ్ స్పీడ్తో
ఈ సర్వీసు ద్వారా బీఎస్ఎన్ఎల్ 1జీబీపీఎస్ టాప్ డౌన్లోడ్ స్పీడ్తో బ్రాడ్బ్యాండ్ సేవలను అందించనుంది.

సెకన్కు 100 ఎంబీ
ప్రస్తుతం కంపెనీ బ్రాడ్బ్యాండ్ సేవల టాప్ డౌన్లోడ్ స్పీడ్ సెకన్కు 100 ఎంబీగా ఉంది.

44 పట్టణాల్లో విజయవంతం
నెక్స్ట్ జనరేషన్ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ (ఎన్జీ-వోటీఎన్) ప్రాజెక్టును బీఎస్ఎన్ఎల్ 44 పట్టణాల్లో విజయవంతంగా అమలు చేసింది.

100 ప్రధాన పట్ట్టణాలకు
సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017-18)లో ఈ పథకం కింద రాష్ట్రాల రాజధానులు సహా 100 ప్రధాన పట్ట్టణాలకు ఈ సేవలను విస్తరించనుంది' అని టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు.

రూ.330 కోట్ల పెట్టుబడులతో
రూ.330 కోట్ల పెట్టుబడులతో రూ.330 కోట్ల పెట్టుబడులతో ఎన్జీ-వోటీఎన్ ప్రాజెక్టు అమలు 3 దశల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








