జియోకి పోటీ ఇస్తున్న బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ఇదే
దేశీయ టెలికాం రంగం రోజురోజుకు టారిఫ్ వార్ లతో వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలు అన్నీ కస్టమర్లను కాపాడుకునేందుకు కొత్త కొత్తగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ తన పాత
దేశీయ టెలికాం రంగం రోజురోజుకు టారిఫ్ వార్ లతో వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలు అన్నీ కస్టమర్లను కాపాడుకునేందుకు కొత్త కొత్తగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ తన పాత ప్లాన్ రూ.666లో కొద్ది పాటి మార్పులు చేసింది. ఈ మార్పులతో కస్టమర్లు అదను డేటాను అందుకుంటారు.

అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ కలకత్తా వినియోగదారులకు మాత్రమైనని తెలిపింది. కాగా ఈ ప్లాన్లు జియో రూ.498కి గట్టిపోటీనివ్వనున్నాయి. అతదనపు డేటాతో పాటు అదనపు వ్యాలిడిటీని ఈ ప్లాన్ లో అందించారు.

రూ.666 ప్లాన్
గతేడాది జూన్ లో బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను లాంచ్ చేసింది. దీని ప్రకారం 129 రోజల వ్యాలిడిటీని 122 రోజులకు తగ్గించింది. ఉచిత అన్ లిమిటెడ్ లోకల్ నేషనల్ రోమింగ్ కాల్స్ ఉంటాయి. అయితే ఢిల్లీ ముంబై ప్రాంతాలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. రోజుకు 100 ఎస్మెమ్మెస్ లు అలాగే 1.5 జిబి డేటా లభిస్తుంది. అయితే ఇప్పడు వ్యాలిడిటీని తగ్గించి డేటాను మరింతగా పెంచారు. 1.5 జిబి డేటా నుంచి రోజుకు 3.7జిబి డేటాను అందిస్తోంది. ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.40 కెబిపిఎస్ తో సేవలు అందుతాయి.

జియో రూ.498 ప్లాన్
జియో రూ.498 ద్వారా 91 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జిబి చొప్పున అందుకుంటారు. ఉచిత అన్ లిమిటెడ్ లోకల్ నేషనల్ రోమింగ్ కాల్స్ ఉంటాయి. రోజుకు 100 ఎస్మెమ్మెస్ లు లభిస్తాయి.కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్సన్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా జియో యాప్స్ అన్నీ ఉచితంగా లభిస్తాయి.

ఎయిర్టెల్ రూ.498 ప్లాన్
ఎయిర్టెల్ రూ.498 ద్వారా 82 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జిబి చొప్పున అందుకుంటారు. ఉచిత అన్ లిమిటెడ్ లోకల్ నేషనల్ రోమింగ్ కాల్స్ ఉంటాయి. రోజుకు 100 ఎస్మెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లానులో రోజుకు 300 నిమిషాలు అలాగే వారానికి 1000 నిమిషాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30 పైసలు ఛార్జ్ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications








