బడ్జెట్ 2013: మొబైల్ ఫోన్‌ల ధరలు మరింత పెరిగే అవకాశం

|

 Budget 2013: Mobile phones priced above Rs 2,000 may get costlier
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ 2013-14ను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రూ.2000 పైన ధరను కలిగి ఉండే మొబైల్ ఫోన్‌ల పై దిగుమతి సుంకాంన్ని 1శాతం నుంచి 6 శాతానికి పెంచుతున్నట్లు ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దింతో రూ.2,000కన్నా ఎగువ ధరను కలిగి ఉండే విదేశీ బ్రాండ్‌‍ల మొబైల్ ఫోన్‌ల ధరలు మరింత పెరగన్నాయి.

రైల్వే బడ్జెట్ 2013: ఐఆర్‌సీటీసీ పునరుద్ధరణ ఇంకా ఉచిత వై-ఫై‌ పై మంత్రి హామి

 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మంగళవారం మధ్యాహ్నం 2013-14 సంవత్సారానికి‌గాను రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో భాగంగా ఈ-టికెటింగ్ సిర్వీస్‌ను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. రైల్వే ఆన్‌లైన్ బుకింగ్‌కు తోడ్పడుతున్న ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను మరింత మెరుగుపరిచే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి స్ఫష్టం చేసారు. ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి ఈ-టికెటింగ్ వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నట్లు బన్సల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

 

సరికొత్త ఈ-టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రావటం వల్ల ఐఆర్‌సీటీసీ ద్వారా నిమిషానికి 7,200టికెట్‌లను పొందవచ్చని అన్నారు. ప్రస్తుత ఐఆర్‌సీటీసీ పనితీరును పరిశీలించినట్లయితే నిమిషానికి కేవలం 2,000 టికెట్‌లను మాత్రమే అందించగలగుతుంది. అదేవిధంగా రాబోయే ఈ - టికెటింగ్ వ్యవస్థ, ఐఆర్‌సీటీసి వెబ్‌సైట్‌ను ఏకకాలంలో లక్షమందిని సపోర్ట్ చేసేవిధంగా తీర్చిదిద్దుతుందని బన్సల్ అన్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X