Just In
- 11 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 12 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 12 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 15 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సముద్రం లో 2300 కి.మీ. ల ఇంటర్నెట్ కేబుల్ లు, వీటి గురించి మోడీ ఏమన్నారు?
ఈ నెల 10 వ తేదీన చెన్నై మరియు అండమాన్ లోని పోర్ట్ బ్లెయిర్లను కలిపే విధంగా జలాంతర్గామి ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్ ను ప్రారంభించడం జరిగింది.ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీద ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ వివరాలను పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.ఈ కేబుల్ చెన్నై, పోర్ట్ బ్లెయిర్, స్వరాజ్ ద్వీపం, లిటిల్ అండమాన్, కార్నికోపార్, కొమొర్టే, గ్రేట్ నికోబార్ లాంగ్ ఐలాండ్ మరియు రంగా దీవులను కలుపుతుంది.
జలాంతర్గామి కేబుల్ ప్రాజెక్టు
ముఖ్యంగా, నికోబార్ దీవులకు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే సెల్ ఫోన్ మరియు ల్యాండ్లైన్ టెలిఫోన్ సేవల అనుసంధానం కలిగి ఉంటుంది.పోర్ట్ బ్లెయిర్లో 2018 డిసెంబర్ 30 న జలాంతర్గామి కేబుల్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని మోదీ పునాదిరాయి వేశారు. దీని తరువాత రూ .1,224 కోట్ల వ్యయంతో 2,300 కిలోమీటర్ల పొడవైన జలాంతర్గామి ఫైబర్గ్లాస్ కేబుల్ ను ప్రారంభించారు.
Also Read :ఏవిధమైన డాక్యుమెంట్స్ లేకుండా Aadhaar Cardలో అడ్రసును అప్డేట్ చేయడం ఎలా?
చెన్నై మరియు పోర్ట్ బ్లెయిర్ మధ్య
ఈ ప్రాజెక్ట్ చెన్నై మరియు పోర్ట్ బ్లెయిర్ మధ్య హైస్పీడ్ టెలికమ్యూనికేషన్ మరియు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇది అండమాన్ దీవులలో పర్యాటకం మరియు ఉపాధిని కూడా పెంచుతుంది. ఆర్థిక వృద్ధికి ప్రేరణగా నిలుస్తుందని నివేదికలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా జీవన ప్రమాణాలను పెంచడం. టెలిమెడిసిన్ మరియు విద్య వంటి ఇ-గవర్నెన్స్ సేవలను అందించడానికి ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు.
ప్రాజెక్ట్ ప్రారంభం అయిన తరువాత
ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయిన తరువాత, అండమాన్ మరియు నికోబార్లలోని ఇంటర్నెట్ బిల్లులు కూడా గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం ఈ ఐలాండ్ లలో నివసించే ప్రజలు ఇంటర్నెట్ కనెక్షన్ కోసం అధిక ధరలను చెల్లిస్తారు.
ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) అమలు పరిచింది,మరియు టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టిసిఐఎల్) టెక్నికల్ కన్సల్టెంట్స్ ను సమకూర్చింది.
ప్రధాని నరేంద్ర మోడీ
ప్రారంభం రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుండి వీడియో ద్వారా ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అండమాన్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) వాలంటీర్లతో ప్రధాని మాట్లాడారు.
ప్రాజెక్టుల కోసం
భారత దేశానికి అండమాన్ దీవులు వ్యూహాత్మకంగా ఉన్నాయి, ఇది ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన కేంద్రంగా ఉంది, సమాఖ్య ప్రభుత్వం దీనిని నీలి ఆర్థిక కేంద్రంగా మరియు సముద్ర కొత్త పారిశ్రామిక కేంద్రంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. సముద్ర సేంద్రీయ మరియు కొబ్బరి ఆధారిత ఉత్పత్తులలో వాణిజ్యాన్ని పెంచే లక్ష్యంతో అండమాన్ మరియు నికోబార్ దీవుల 12 ద్వీపాలు అధిక ప్రభావ ప్రాజెక్టుల కోసం ఎంపిక చేయబడ్డాయి.
ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతానికి
ముఖ్యంగా ఈ ప్రాంతం ప్రభుత్వ అటానమస్ ఇండియా కార్యక్రమంలో మరియు కొత్త భారతదేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చెన్నై-పోర్ట్ బ్లెయిర్ జలాంతర్గామి ఫైబర్ ఆప్టిక్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతానికి బయటి ప్రపంచంతో ఆన్లైన్లో కమ్యూనికేట్ చేయడంలో ఎటువంటి సమస్యలు లేకుండా చేయవచ్చని నివేదికలు తెలియచేస్తున్నాయి.
అండమాన్ దీవులలోనే కాదు
మన అండమాన్ దీవులలోనే కాదు ప్రపంచంలో చాల చోట్ల ఈ కేబుల్ లు అమర్చారు.వాటి గురించి అవి ఎలాపనిచేస్తాయి? ఒకవేళ అవి తెగిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి ?అనే విషయాలు తెలుసుకుందాం.
ఇవి కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రపంచ వ్యాప్తంగా అందిస్తుంటాయి.అయితే ఈ కేబుల్స్ ప్రధానంగా అట్లాంటిక్ సముద్రంలోనే చాలావరకు ఉన్నాయి. సముద్రంలో వేసిన వైర్లతోనే ప్రపంచంలోని అన్ని దేశాల సమాచార వ్యవస్థ నడుస్తోంది. మరి ఈ కేబుల్స్ తెగిపోతే పరిస్థితి ఏంటీ. దేశాల సమాచార వ్యవస్థకు ఎటువంటి అంతరాయం కలుగుతుంది.
ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..
అప్పట్లో రష్యాకు చెందిన జలాంతర్గాములు అట్లాంటిక్ సముద్రంలో అండర్వాటర్ కేబుల్స్ ఉన్న కీలక ప్రాంతాల్లో తిష్టవేశాయని అమెరికా ఆరోపించింది .ఒకవేళ సబ్మెరైన్లు ఈ కేబుల్ లింకులను తెంచేస్తే ఇంటర్నెట్ సేవలకు పెద్ద అంతరాయమే ఏర్పడుతుందని ఆందోళనలు
ఈ వైర్లు తెగితే ప్రపంచం అంధకారంలోకే..
దీని వల్ల అంతర్జాతీయ సంబంధాలు, బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుందని అన్ని దేశాలు ఎప్పుడూ కలవరపడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ వైర్ల నుంచే ప్రపంచంలో మొత్తం సమాచార వ్యవస్థ నడుస్తోంది.
కేబుల్స్ ఒకవేళ తెగినా
తీరం దగ్గర ఉన్న కేబుల్స్ ఒకవేళ తెగినా వాటిని రిపేర్ చేయడం సులభమే. కానీ సముద్రం మధ్యలో ఉన్న కేబుల్స్ను రిపేర్ చేయడం కష్టంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరి అక్కడ కేబుల్స్ తెగిపోతే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకమే.
ప్రమాదకర సొరచేపలు
మానవుల సంగతి పక్కన బెడితే గతేడాది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ను సొర చేపలు కలవరపాటుకు గురిచేసాయి. ప్రపంచదేశాలకు ఇంటర్నెట్ అనుసంధానం కోసం సముద్రం అడుగుభాగాన గూగుల్ అమర్చిన కేబుల్ వ్యవస్థను ప్రమాదకర సొరచేపలు ధ్వంసం చేశాయి. దీంతో ఒక్కసారిగా గూగుల్ షాక్కు గురయి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
కేబుళ్లను కాపాడుకునేందుకు
ఈ భయానక సముద్ర జీవుల నుంచి తమ కేబుళ్లను కాపాడుకునేందుకు గూగుల్, ఓ రక్షణాత్మక వ్యవస్థను రూపొందించింది. సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఫైబర్ కేబుళ్లకు కెవ్లార్ (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగించే పదార్థం) తరహా తొడుగును గూగుల్ వర్గాలు అమర్చే పనిలో పడ్డాయి.
సొర చేపలు వైర్లను ధ్వసం చేయకుండా ఉండేందుకు
సొర చేపలు వైర్లను ధ్వసం చేయకుండా ఉండేందుకు కేబుల్స్కు పైపూతగా కేవ్లార్ అనే సింథటిక్ ఫైబర్ను పైపొరగా వాడినా ఫలితం ఉండట్లేదని గూగుల్ కలవరపడింది కూడా. అదీగాక ఈ సరికొత్త రక్షణాత్మక వ్యవస్థను అత్యంత కఠినమైనదని గూగుల్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ విషయం 1980-90 మధ్య కాలంలోనే వెలుగులోకి వచ్చింది. మరి కేబుల్స్ సొర చేపలు ఎందుకు కొరికేస్తున్నాయంటే అదీ విచిత్రమే. కేబుల్స్ వల్ల స్వల్ప అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. అయితే ఆహార వేట కోసం సొరచేపల నోటిలో అయస్కాంత క్షేత్రాలను గుర్తించే సెన్సర్లు ఉండటంతో అవి ఈ కేబుల్స్ను గుర్తించి దాడి చేస్తున్నాయట.
హాంగ్కాంగ్కి సైతం
ఇక హాంగ్కాంగ్కి సైతం అమెరికాతో ఈ తిప్పలు తప్పలేదు. హాంగ్ కాంగ్ లో Pacnet కంపెనీకి హెడ్ క్వార్టర్లోని కంప్యూటర్లను అమెరికా ప్రభుత్వ గూఢచారులు హ్యాక్ చేశారని స్నోడెన్ తెలిపాడు. 2009లో Pacnet కంప్యూటర్లపై గూఢచారులు దాడి చేశారని అయితే ఆ తర్వాత మళ్ళీ దాడి చేయలేదని బాంబు పేల్చారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో
Pacnet అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విస్తరించిన భారీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ నిర్మాణాలకు సొంతదారు. దీనికి హాంగ్ కాంగ్, సింగపూర్ లలో గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. కంపెనీ ఆధీనంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ సముద్రం అడుగున దాదాపు 46,000 కి.మీ విస్తరించి ఉన్నాయి.
ఈ కేబుల్స్ ను హ్యాక్ చేయగలిగితే
ఈ కేబుల్స్ను ఆసియా-పసిఫిక్ దేశాలలో విస్తరించిన ప్రభుత్వ మరియు ప్రైవేటు బహుళజాతి టెలికాం కంపెనీలు వినియోగిస్తాయి. ఈ కేబుల్స్ ను హ్యాక్ చేయగలిగితే ఆసియా-పసిఫిక్ దేశాల కమ్యూనికేషన్ల వ్యవస్థను ఈజీగా తెలుసుకోవచ్చు.
అమెరికా, బ్రిటన్...
అమెరికా, బ్రిటన్ గూఢచార కంపెనీలు ఆ మధ్య చేసింది కూడా అదే. చైనా, హాంగ్ కాంగ్, కొరియా, జపాన్, తైవాన్, ఫిలిప్పైన్స్ తదితర దేశాలు ఈ నెట్ వర్క్ను వినియోగిస్తున్నాయని తెలిసి అమెరికా ఈ కేబుల్స్ ని హ్యాక్ చేసి ఆ దేశాల సమాచారాన్ని సేకరించాలని ప్రయత్నించింది.
ఇక 2008 సంవత్సరంలో
ఇక 2008 సంవత్సరంలో కూడా ఈ కేబుల్స్ వల్ల తీవ్ర అంతరాయం జరిగింది. మధ్యధరా సముద్రంలో వున్న ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ తెగిపోయాయి! దెబ్బతో ఇండియాతో సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తూ ఉన్న నెట్వర్క్లన్నీ ఒక్కసారిగా మూతబడ్డాయి . ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే పలు రంగాలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.
ఐతే బ్యాకప్గా
మాములుగా సముద్ర గర్భంలోని కేబుల్స్ భారీ చేపల వల్లా, నౌకల లంగర్లవల్లా, అలాగే సముద్రంలో వచ్చే ఉపద్రవాలవల్ల అప్పుడప్పుడూ తెగిపోతూంటాయి. ఐతే బ్యాకప్గా అదనపు లైన్లుండటం వల్ల ఇంటర్నెట్ సేవలకు అంతగా అంతరాయం ఏర్పడదు.
అయితే దురదృష్టం కొద్దీ
అయితే దురదృష్టం కొద్దీ 2008లో ఫిబ్రవరి నెలలో ప్రధాన కేబుల్ కాదు, బ్యాకప్ కేబుల్స్ కూడా తెగిపోయాయి. దాంతో అనేక దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోయింది.
కేబుళ్లను పునరుద్ధిరించే పని
సముద్రగర్భంలో తెగిపోయిన ఈ ఇంటర్నెట్ కేబుళ్లను పునరుద్ధిరించే పనిని ఫ్లాగ్ టెలీకాం తీసుకుంది. అయితే ఈ నౌకలు వల్ల కూడా వైర్లు తెగిపోయిన సంధర్భాలు ఉన్నాయి. జనవరి 30వ తేదీన ఈజిప్ట్ నగరమైన అలెగ్జాండ్రియా తీరానికి 56 కిలోమీటర్ల దూరంలో ఒక నౌక సముద్రంలో లంగరు వేసే ప్రయత్నంలో కేబుళ్లు తెగిపోయాయి.
రిలయన్స్ కమ్యూనికేషన్స్
ఈ ఘటనలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ సబ్సిడరీ అయిన ఫ్లాగ్ టెలీకాం సంస్థకు చెందిన రెండు కేబుళ్లు తెగిపోయాయి. దీనిపై ఫ్లాగ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేబుళ్ల పునరుద్ధరణ దిశగా మరమ్మతు చర్యలు చేపట్టేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు తెలిపారు కూడా.
ఇంటర్నెట్ కార్యకలాపాల్లో 95 శాతం
మాములుగా ఇంటర్నెట్ కార్యకలాపాల్లో 95 శాతం సముద్రగర్భ కేబుళ్ల ద్వారా సాగుతుండగా, మిగిలిన పనులు ఉపగ్రహ అనుసంధానంతో కొనసాగుతున్నాయి. మరి వీటిని కంట్రోల్ చేయడానికి అగ్రదేశాలు కుయుక్తులు పన్నితే మరో యుద్ధం వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం.
సబ్ మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్
ఇక్కడ మీరు చూస్తున్నది సబ్ మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్. దీని అడ్డుకొలత 69 మిల్లీమీటర్లు(అంటే 2.7 ఇంచ్లు). ఇది ఒక్క అంటార్కిటికాను తప్ప ప్రపంచములోని 99 శాతం అంతర్జాతీయ ఇంటర్నెట్, టెలిఫోన్ మరియూ ప్రైవేట్ డాటా ట్రాఫిక్ను ప్రపంచ నలుమూలాలలనూ కలుపుతుంది.
కొన్ని వేల కిలోమీటర్ల దూరం
ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఎన్నో సముద్రాలను దాటుతూ కొన్ని వేల కిలోమీటర్ల దూరం వేయబడింది. ఈ వైరుకి ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచంలోని మొత్తం సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది కూడా. సముద్రంలో వైర్లకు ఏ ప్రమాదం జరిగినా దేశాలన్నీ ఛిన్నా భిన్నం అయిపోవాల్సిందే.
అత్యంత పెద్ద నెట్ వర్క్
ఈ మ్యాప్ లో మీరు చూస్తున్నది ప్రపంచదేశాలను కలిపే అత్యంత పెద్ద నెట్ వర్క్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470