గేమింగ్ కంపెనీలకు షాక్ ఇచ్చిన చైనా ప్రభుత్వం
గేమింగ్ కంపెనీలకు షాక్ ఇచ్చిన చైనా ప్రభుత్వం.ఈ నేపథ్యంలో ఆన్ లైన్, మొబైల్, కన్సోల్ గేమింగ్ కంపెనీల లైసెన్స్ అనుమతులను నిలిపేస్తున్నట్టు తెలిపింది
గేమింగ్ కంపెనీలకు చైనా ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్, మొబైల్, కన్సోల్ గేమింగ్ కంపెనీల లైసెన్స్ అనుమతులను నిలిపేస్తున్నట్టు తెలిపింది. విలువలను ఉల్లంఘించడం, హింసను ప్రేరేపించడం, జూదాన్ని ప్రోత్సహిస్తున్న కొన్ని వీడియో గేమ్స్ ద్వారా ప్రజలను గేమింగ్ కి బానిసలుగా తయారు చేస్తున్నారనే అభియోగంపై చైనా ప్రభుత్వం లైసెన్సులను ఆపేసింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వ శాఖలు గేమింగ్ కంపెనీల అనుమతులను పరిశీలించేందుకు రెడీ అయిపోయింది.

ఎక్కువ స్మార్ట్ ఫోన్ యూజర్స్ మరియు వెబ్ యూజర్లు ఉండడటంతో....
చైనా అత్యంత జనాభా ఉన్న దేశం ఆ దేశం లో స్మార్ట్ ఫోన్ యూజర్లు అదే విధంగా వెబ్ యూజర్లు కూడా ఎక్కువ దీంతో సుమారుగా 37.9 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది చైనా గేమింగ్ మార్కెట్ కి.

వీడియో గేమ్స్ కి అనుమతులు ఇవ్వడంలో......
వీడియో గేమ్స్ కి అనుమతులు ఇవ్వడంలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన విధానాలను చైనా ఇప్పుడు పాటిస్తుంది. ఆన్ లైన్ అంశాలపై నియంత్రణ ద్వారా తిరుగుబాటు ధోరణలను అణిచివేయడం, సెక్స్, గ్రాఫిక్స్ హింస వంటి వాటిని మొదటిలోనే చిదిమేయడం ఈ అనుమతుల ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం.

చిన్నాపెద్దా గేమింగ్ కంపెనీల షేర్లు పతనం....
ప్రభుత్వ ప్రకటన వెలువడవడంతో ఆన్ లైన్ గేమింగ్ దిగ్గజ కంపెనీలతో సహా పలు చిన్నాపెద్దా గేమింగ్ కంపెనీల షేర్లు 13% వరకు పతనమయ్యాయి.

సోషల్ మీడియా దిగ్గజం టెన్సెంట్ ఒక్కటే 160 బిలియన్ డాలర్లకు పైగా....
చైనాలో గేమింగ్, సోషల్ మీడియా దిగ్గజం టెన్సెంట్ ఒక్కటే 160 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి. బుధవారం తమ ఆదాయాన్ని ప్రకటించిన టెన్సెంట్ గత దశాబ్దంలో మొదటిసారి లాభాలు తగ్గినట్టు తెలిపింది.

చైనా గేమింగ్ పరిశ్రమ పట్టాలెక్కుతుందో....
మళ్ళీ తిరిగి ఎప్పుడు చైనా గేమింగ్ పరిశ్రమ పట్టాలెక్కుతుందో ఇప్పుడే చెప్పడం అసాధ్యమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








