Just In
- 3 min ago రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- 1 hr ago 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- 15 hrs ago రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- 16 hrs ago 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
Don't Miss
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Movies Karthika Deepam March 29th: దీపను బాధపెట్టిన ఓ వ్యక్తి... చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన కార్తీక్!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దేశంలో అత్యధికంగా iPhones వినియోగిస్తున్నది ఆ నగరంలోనే!
దేశంలో ఐఫోన్ల వినియోగానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. దేశంలోనే అత్యధికంగా రాజధాని దిల్లీవాసులు ఐఫోన్లను ఎంపిక/ వినియోగిస్తున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. Cashify అనే సంస్థ ఇటీవల వైట్పేపర్ పేరుతో సర్వే నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.
సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఢిల్లీ వాసులు అత్యధికంగా ఐఫోన్లను ఇష్టపడుతున్నారు. 8,000 మంది వ్యక్తులపై చేసిన సర్వేలో మొత్తం iPhone వినియోగదారులలో 18% మంది దేశ రాజధానిలో నివసిస్తున్న వారే ఉన్నారని తెలిసింది. బెంగళూరు మరియు ముంబైలలో 11% మరియు 10% మంది ఐఫోన్లను కలిగి ఉన్నారు. అంతేకాకుండా, వినియోగించిన మొబైల్స్ విక్రయాల్లోనూ న్యూఢిల్లీ వినియోగదారులు అత్యధికంగా 18%కి విక్రయించారని, ముంబై మరియు బెంగళూరు మళ్లీ వరుసగా 10% మరియు 9% చొప్పున విక్రయించారని సర్వే పేర్కొంది.
అంతేకాకుండా, 8,000 మందిలో, 71% మంది వినియోగదారులు ఇ-వ్యర్థాలకు సంబంధించిన విషయంపై అవగాహన కలిగి ఉన్నట్లు తెలిసింది. అయితే, వారిలో పాత డివైజ్లను రీసైక్లింగ్ చేసే ప్రక్రియ గురించి మాత్రం కేవలం 48% మందికి మాత్రమే తెలుసని సర్వే పేర్కొంది. సర్వేలో భాగంగా యూజర్లను వారి డివైజ్లను రీసైక్లింగ్ చేయడానికి ఆసక్తి ఉందా అని అడిగినప్పుడు, 58% మంది అంగీకరించారు. 15% మంది వినియోగదారులు మాత్రమే రీసైక్లింగ్తో చేయటానికి నిరాసక్తతత వ్యక్తం చేశారు. అదనంగా మరో 4% మంది తమ డేటా గోప్యత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక మొబైల్ రిపేర్ల విషయానికొస్తే.. దిల్లీలో గరిష్ఠంగా 25శాతం మొబైల్ రిపేర్లు నమోదైనట్లు సర్వే తెలిపింది. మొబైల్ రిపేర్లలో ఎక్కువగా స్క్రీన్ ఇష్యూస్ వల్ల 40%, బ్యాటరీ సమస్యల వల్ల 25% మంది, కెమెరా సమస్యల వల్ల 10% మంది, ఇతర ఫోన్ సమస్యల వల్ల 25% మంది తమ ఫోన్లను రిపేర్ చేసుకున్నట్లు వైట్పేపర్ వెల్లడించింది.
అత్యధికంగా అమ్ముడైన వాడిన మొబైల్స్ ఏవి:
వినియోగదారులు ఉపయోగించిన స్మార్ట్ఫోన్లను అత్యధికంగా విక్రయించిన జాబితాలో Xiaomi (25%), Apple (16%), మరియు Samsung (15%) మొదటి మూడు బ్రాండ్లుగా నిలిచాయి. Apple iPhone 7 బైబ్యాక్లో అగ్రస్థానంలో నిలిచింది.. మరియు Redmi Note 5 Pro రెండవ స్థానంలో నిలిచింది, తర్వాత Redmi Note 4, Apple iPhone 6 మరియు Apple iPhone Xలు ఉన్నాయి.
మొబైల్స్ను ఆన్లైన్లో విక్రయానికి ఉంచేటప్పుడు, వారి డివైజ్ల వాస్తవ స్థితిని అత్యంత నిజాయితీగా పేర్కొన్న వినియోగదారుల ఇండెక్స్లో బెంగళూరు 29%తో అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్ 28%తో రెండో స్థానంలో ఉంది. కోల్కతా మరియు పూణేలు 21%తో అత్యల్ప స్థాయిని కలిగి ఉన్నాయి. ఇక రిఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్ మార్కెట్ ప్రయోజనాల గురించి చర్చిస్తే.. రిఫర్బిష్డ్ మార్కెట్ ఇ-వ్యర్థాలు తగ్గిస్తుంది. అంతేకాకుండా బడ్జెట్లో ఫ్రెండ్లీ డీల్స్ను అందిస్తుంది. ఉపయోగించిన ఫోన్లను ఆన్లైన్లో సులభంగా విక్రయించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకా వైట్పేపర్ సర్వేకు సంబంధించిన పూర్తి విషయాలు కావాలంటే Cashify వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470