దేశంలో అత్యధికంగా iPhones వినియోగిస్తున్నది ఆ నగరంలోనే!
దేశంలో ఐఫోన్ల వినియోగానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. దేశంలోనే అత్యధికంగా రాజధాని దిల్లీవాసులు ఐఫోన్లను ఎంపిక/ వినియోగిస్తున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. Cashify అనే సంస్థ ఇటీవల వైట్పేపర్ పేరుతో సర్వే నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.

సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఢిల్లీ వాసులు అత్యధికంగా ఐఫోన్లను ఇష్టపడుతున్నారు. 8,000 మంది వ్యక్తులపై చేసిన సర్వేలో మొత్తం iPhone వినియోగదారులలో 18% మంది దేశ రాజధానిలో నివసిస్తున్న వారే ఉన్నారని తెలిసింది. బెంగళూరు మరియు ముంబైలలో 11% మరియు 10% మంది ఐఫోన్లను కలిగి ఉన్నారు. అంతేకాకుండా, వినియోగించిన మొబైల్స్ విక్రయాల్లోనూ న్యూఢిల్లీ వినియోగదారులు అత్యధికంగా 18%కి విక్రయించారని, ముంబై మరియు బెంగళూరు మళ్లీ వరుసగా 10% మరియు 9% చొప్పున విక్రయించారని సర్వే పేర్కొంది.
అంతేకాకుండా, 8,000 మందిలో, 71% మంది వినియోగదారులు ఇ-వ్యర్థాలకు సంబంధించిన విషయంపై అవగాహన కలిగి ఉన్నట్లు తెలిసింది. అయితే, వారిలో పాత డివైజ్లను రీసైక్లింగ్ చేసే ప్రక్రియ గురించి మాత్రం కేవలం 48% మందికి మాత్రమే తెలుసని సర్వే పేర్కొంది. సర్వేలో భాగంగా యూజర్లను వారి డివైజ్లను రీసైక్లింగ్ చేయడానికి ఆసక్తి ఉందా అని అడిగినప్పుడు, 58% మంది అంగీకరించారు. 15% మంది వినియోగదారులు మాత్రమే రీసైక్లింగ్తో చేయటానికి నిరాసక్తతత వ్యక్తం చేశారు. అదనంగా మరో 4% మంది తమ డేటా గోప్యత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక మొబైల్ రిపేర్ల విషయానికొస్తే.. దిల్లీలో గరిష్ఠంగా 25శాతం మొబైల్ రిపేర్లు నమోదైనట్లు సర్వే తెలిపింది. మొబైల్ రిపేర్లలో ఎక్కువగా స్క్రీన్ ఇష్యూస్ వల్ల 40%, బ్యాటరీ సమస్యల వల్ల 25% మంది, కెమెరా సమస్యల వల్ల 10% మంది, ఇతర ఫోన్ సమస్యల వల్ల 25% మంది తమ ఫోన్లను రిపేర్ చేసుకున్నట్లు వైట్పేపర్ వెల్లడించింది.
అత్యధికంగా అమ్ముడైన వాడిన మొబైల్స్ ఏవి:
వినియోగదారులు ఉపయోగించిన స్మార్ట్ఫోన్లను అత్యధికంగా విక్రయించిన జాబితాలో Xiaomi (25%), Apple (16%), మరియు Samsung (15%) మొదటి మూడు బ్రాండ్లుగా నిలిచాయి. Apple iPhone 7 బైబ్యాక్లో అగ్రస్థానంలో నిలిచింది.. మరియు Redmi Note 5 Pro రెండవ స్థానంలో నిలిచింది, తర్వాత Redmi Note 4, Apple iPhone 6 మరియు Apple iPhone Xలు ఉన్నాయి.

మొబైల్స్ను ఆన్లైన్లో విక్రయానికి ఉంచేటప్పుడు, వారి డివైజ్ల వాస్తవ స్థితిని అత్యంత నిజాయితీగా పేర్కొన్న వినియోగదారుల ఇండెక్స్లో బెంగళూరు 29%తో అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్ 28%తో రెండో స్థానంలో ఉంది. కోల్కతా మరియు పూణేలు 21%తో అత్యల్ప స్థాయిని కలిగి ఉన్నాయి. ఇక రిఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్ మార్కెట్ ప్రయోజనాల గురించి చర్చిస్తే.. రిఫర్బిష్డ్ మార్కెట్ ఇ-వ్యర్థాలు తగ్గిస్తుంది. అంతేకాకుండా బడ్జెట్లో ఫ్రెండ్లీ డీల్స్ను అందిస్తుంది. ఉపయోగించిన ఫోన్లను ఆన్లైన్లో సులభంగా విక్రయించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకా వైట్పేపర్ సర్వేకు సంబంధించిన పూర్తి విషయాలు కావాలంటే Cashify వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








