భారతీయులు OTT సబ్స్క్రిప్షన్ కోసం నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
భారతదేశంలో గత కొన్ని నెలలుగా ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ ప్లాట్ఫామ్ల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండు నెలలకు పైగా లాక్ డౌన్ సమయంలో వీటి డిమాండ్ అమాంతం పెరిగింది. ఇప్పటికి కూడా ప్రజలు ఎక్కువగా తమ ఇళ్లలోనే ఉండి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత సమయంలో చాలా మంది తమ వినోదం కోసం ఎంచుకునే ఏకైక వినోద వనరు ఆన్లైన్లో వీడియోలను చూడడం. అన్ని భాషల పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా ఇప్పుడు తమ కొత్త సినిమాలు మరియు సిరీస్లను విడుదల చేయడానికి ప్రధాన OTT ప్లాట్ఫారమ్లతో భాగస్వామ్యం కావడం ఆసక్తికరంగా ఉంది.

అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ బ్రైట్కోవ్ యొక్క సర్వే ప్రకారం భారతీయులు OTT చందాలను కొనుగోలు చేసెందుకు నెలకు 400 రూపాయలు సంతోషంగా చెల్లిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

దేశంలో సుమారు 40 రకాల క్రియాశీల OTT ప్లాట్ఫారమ్లు ఉన్నాయి.
చాలా మంది భారతీయులు ఏ ప్లాట్ఫారమ్ ఉపయోగకరంగా ఉంది మరియు ఏది ఉపయోగకరంగా లేదో అర్థం చేసుకోవడానికి అన్ని రకాల ప్లాట్ఫారమ్లను పరీక్షించే లగ్జరీని కూడా కలిగి ఉన్నారు. ఇందులో భాగంగా చాలా తక్కువ-నాణ్యత గల వాటిని ఎంచుకోవడం కంటే అధిక-నాణ్యత గల రెండు లేదా మూడు ప్లాట్ఫారమ్ల కోసం చెల్లించడానికి చాలా మంది వినియోగిస్తున్నారు. బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లోని OTT వినియోగదారుల వాడకంతో పోల్చినప్పుడు భారతీయ వినియోగదారులు గణనీయమైన వృద్ధిలో OTT ప్లాట్ఫారమ్లను వినియోగిస్తున్నారు అని బ్రైట్కోవ్ చేసిన సర్వేలో తేలింది.

నివేదికలో
సర్వేలో పాల్గొన్న ప్రతివాదులు 60% మంది కొత్త కొత్త OTT ప్లాట్ఫారమ్లను మరియు దాని కంటెంట్ను మొదట సోషల్ మీడియా ద్వారా కనుగొన్నట్లు తెలిపారు. నివేదికలో హైలైట్ చేసిన మరో విషయం ఏమిటంటే OTT ప్లాట్ఫారమ్లలో ఎక్కువగా ప్రకటనలను ఉపయోగిస్తున్నారు. దాదాపు 33% మంది ప్రతివాదులు చాలా తక్కువ మొత్తంలో రుసుమును చెల్లించేటప్పుడు లేదా ఎటువంటి రుసుము చెల్లించనప్పుడు ప్రకటనలు చూడటం ఆమోదయోగ్యమని తెలిపారు. అయితే కేవలం 24% మంది మాత్రమే ప్రకటనలను లేకుండా మినహాయింపు కోసం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.


Click it and Unblock the Notifications








