Just In
- 53 min ago Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- 15 hrs ago రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 16 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 17 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
Don't Miss
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మొబైల్ యూజర్లకు మరో మంచి శుభవార్త
మొబైల్ యూజర్లకు టెలికాం డిపార్ట్మెంట్ శుభవార్తను చెప్పింది. ఆధార్తో మొబైల్ నెంబర్ల రీ-వెరిఫికేషన్ ప్రక్రియ గడువును టెలికాం డిపార్ట్మెంట్ పొడిగించినట్టు ప్రకటించింది.
మొబైల్ యూజర్లకు టెలికాం డిపార్ట్మెంట్ శుభవార్తను చెప్పింది. ఆధార్తో మొబైల్ నెంబర్ల రీ-వెరిఫికేషన్ ప్రక్రియ గడువును టెలికాం డిపార్ట్మెంట్ పొడిగించినట్టు ప్రకటించింది. ఆధార్ వాలిడిటీపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు ఈ వెరిఫికేషన్ చేపట్టుకోవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ప్రస్తుత మొబైల్ సబ్స్క్రైబర్లు ఆధార్ ఆధారితంగా జరిపే ఈ-కేవైసీ ప్రక్రియను, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు పెంచుకోవచ్చని వెల్లడించింది. అదేవిధంగా ప్రస్తుతం టెలికాం కంపెనీలు పంపుతున్న వాయిస్, టెక్ట్స్ మెసేజ్లలో రీ-వెరిఫికేషన్ ప్రక్రియ చివరి తేదీని పేర్కొనకూడదని ఆదేశాలు జారీచేసింది. పలు సర్వీసులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్పనిసరి చేస్తున్న ఆధార్ లింకేజీపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. మార్చి 13న జరిపిన విచారణలో ఆధార్ డెడ్లైన్ను మార్చి 31 కాకుండా, రాజ్యాంగ బెంచ్ తుది తీర్పు వెల్లడించే వరకు పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సెల్ఫీ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో దూసుకొస్తున్న OPPO F7 , మార్చి26న ముహుర్తం
ఈ ఏడాది జనవరి 1 నుంచి..
ఈ ఏడాది జనవరి 1 నుంచి టెలికాం డిపార్ట్మెంట్, ఆటోమేటెడ్ కస్టమర్ కేర్ నెంబర్ 14546 ద్వారా అన్ని ఆపరేటర్లు మొబైల్ నెంబర్ల రీ-వెరిఫికేషన్ను చేపట్టేలా వీలు కల్పించింది. తొలుత దీని ద్వారా జరిగే ప్రక్రియకు ఫిబ్రవరి 6ను డెడ్లైన్గా విధించి, అనంతరం మార్చి 31కి మార్చింది.
సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ..
ప్రస్తుతం ఈ ప్రక్రియను సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు చేపట్టవచ్చని టెలికాం డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఓటీపీ, ఫింగర్ప్రింట్ అథెంటికేషన్ ఇవ్వలేని కస్టమర్లకు వారి ఇంటి వద్దే మొబైల్ నెంబర్ రీ-వెరిఫికేషన్ చేపట్టేందుకు డీఓటీ గత అక్టోబర్లో అనుమతి ఇచ్చింది. ఆధార్ లేని విదేశీయులు ఈ ప్రక్రియను వారు తమ మొబైల్ నెంబర్ ఆపరేటర్ రిటైల్ అవుట్లెట్కు వెళ్లి, పాస్పోర్టు వివరాలు అందించి చేపట్టాల్సి ఉంటుంది.
వివిధ సంక్షేమ పథకాలకు
కాగా ఆధార్ ను వివిధ సంక్షేమ పథకాలకు,సేవలకు తప్పనిసరి చేస్తూ కేంద్రం విధించిన గడువును అత్యున్నత న్యాయస్థానం మరోసారి పొడిగించింది.ఆధార్ అనుసంధానంపై కేసును విచారిస్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ఐదురుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి గడుపు పెంపుపై నిర్ణయం తీసుకుంది.
మొబైల్ ఫోన్లు, బ్యాంకు అకౌంట్లకు
మొబైల్ ఫోన్లు, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ అనుసంధానికి సంబంధించి తుది తీర్పు వచ్చే వరకూ గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇదివరకు మార్చి 31 చివరి గడువు..
ఇదివరకు ఆధార్ అనుసంధానానికి మార్చి 31 చివరి గడువు ఉంది. కానీ కేంద్రం గడువును పొడిగించవచ్చు అని సంకేతాలు పంపింది. గత ఏడాది డిసెంబరు 15న వివిధ సేవలు, సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయాలన్న గడువును మార్చి 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు పొడిగించిన విషయం తెలిసిందే..!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470