Home
News

IPL 2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ ఎడిషన్ హక్కులను దక్కించుకున్న Dream11

ప్రముఖ ఆన్‌లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 గురించి దాదాపుగా అందరికి తెలిసి ఉంటుంది. మరి ముఖ్యంగా స్పోర్ట్స్ అభిమానులకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2008 లో ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తలు దీనిని స్థాపించారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ టి 20 లీగ్ IPL యొక్క ఎడిషన్ హక్కులు గత సంవత్సరం చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ స్పాన్సర్‌షిప్ ఎడిషన్ హక్కులను డ్రీమ్ 11 సుమారు 222 కోట్లకు దక్కించుకున్నది.

BCCI - IPL స్పాన్సర్‌షిప్ హక్కులు

BCCI - IPL స్పాన్సర్‌షిప్ హక్కులు

గత సంవత్సరం టైటిల్ స్పాన్సర్లను గెలుచుకున్న చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివోతో భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (BCCI) ఈ నెల ప్రారంభంలో నిర్ణయించి అధికారికంగా ప్రకటించింది. లడఖ్‌లో 20 మంది భారతీయ సైనికుల మరణానికి దారితీసిన చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య ఈ నిర్ణయంను తీసుకున్నట్లు BCCI ప్రకటించింది.

 

డ్రీమ్ 11 ప్రారంభం

డ్రీమ్ 11 ప్రారంభం

ప్రముఖ చైనా సోషల్ మీడియా మరియు వీడియో గేమ్స్ దిగ్గజం టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ నేతృత్వంలో 2018 లో ముంబైకి చెందిన హర్ష్ జైన్ మరియు భావిత్ శేత్ డ్రీమ్ 11 సంస్థను మొదట స్థాపించారు. డ్రీమ్ 11 మొదలైన మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 100 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సేకరించి పెట్టుబడిదారులకు మరింత ఇష్టమైనదిగా మారింది.

డ్రీమ్ 11 ప్లాట్‌ఫామ్‌లో క్రికెట్ గేమ్

డ్రీమ్ 11 ప్లాట్‌ఫామ్‌లో క్రికెట్ గేమ్

డ్రీమ్ 11 యొక్క ప్లాట్‌ఫామ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన గేమ్ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్. డ్రీమ్ 11లో క్రికెట్ యొక్క వినియోగదారుల సంఖ్య సుమారు 85 శాతం వరకు ఉంది. ప్రస్తుతం దాదాపుగా ఎనిమిది కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న డ్రీమ్ 11 "యునికార్న్ క్లబ్" లో ప్రవేశించిన మొదటి భారతీయ గేమింగ్ కంపెనీగా అవతరించింది.

డ్రీమ్ 11 లో ఇతర గేమ్ లు

డ్రీమ్ 11 లో ఇతర గేమ్ లు

టెన్సెంట్‌తో పాటు కలరి క్యాపిటల్, థింక్ ఇన్వెస్ట్‌మెంట్స్, మల్టిపుల్స్ ఈక్విటీ మరియు స్టీడ్‌వ్యూ క్యాపిటల్ సంస్థలు డ్రీమ్ 11 లో మార్క్యూ ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. ఫాంటసీ క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ మరియు హాకీ వంటి గేమ్లను ఆడటానికి ప్రజలను అనుమతించే డ్రీమ్ 11 ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఇతర ఆటగాళ్ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

IPL 2020 స్పాన్సర్‌షిప్ హక్కులు మరియు IPL ప్రారంభం

IPL 2020 స్పాన్సర్‌షిప్ హక్కులు మరియు IPL ప్రారంభం

కొన్ని నివేదికల ప్రకారం డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL యొక్క స్పాన్సర్‌షిప్ హక్కులను రూ.222 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ కొత్త స్పాన్సర్‌షిప్ వ్యవధి డిసెంబర్ 31 వరకు ఉండనున్నది. ప్రస్తుతానికి ఐపిఎల్ 2020 టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరుగనున్నది. అయితే ఏదైనా కారణాల చేత టోర్నమెంట్ మరింత వాయిదా పడితే కనుక డ్రీమ్ 11 యొక్క స్పాన్సర్‌షిప్ హక్కులు 2020 చివరి వరకు చెల్లుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
Dream11 Secures IPL 2020 Title Sponsorship Edition Rights
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X