ఎందుకలా చేసాడు..?
డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తోన్న వీడియోలకు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. తాజాగా యూఎస్లోని రోడ్ ఐలాండ్లో చోటు చేసుకున్న ఓ ఘటన ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయ్యింది.

200 అడుగుల ఎత్తులో ఉన్న విండ్ టర్బైన్ పై ఓ వ్యక్తి రిలాక్స్ అవుతోన్న దృశ్యాన్ని డ్రోన్ కెమెరా చిత్రీకరించింది. శాన్డిగో ప్రాంతానికి చెందిన డ్రోన్ పైలెట్ కెవిన్ మిల్లర్ రోడ్ ఐలాండ్కు విహారయాత్రకు వచ్చిన సందర్భంగా ఈ ఫుటేజ్ను క్యాప్చుర్ చేసారు. టర్బైన్ లోపల ఏర్పాటు చేసిన రుంగ్ లాడర్ ద్వారా ఆ వ్యక్తి టర్బైన్ పైకి ఎక్కి ఉండొచ్చని తెలుస్తోంది.
Read More: 4000కే 4జీ ఫోన్ అంటోన్న కంపెనీలు

ఈ టర్బైన్ ఎక్కేందుకు ఆ వ్యక్తి పర్మిషన్ తీసుకున్నాడా? లేదా? అన్న అంశం పై కూడా స్పష్టత లేదు. ఏదేమైనప్పటికి డ్రోన్ కెమెరా చిత్రీకరించిన ఈ వీడియోకు నెటిజనులు నుంచి మంచి స్పందన లభిస్తోంది.


Click it and Unblock the Notifications








