Just In
- 3 hrs ago 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- 4 hrs ago ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- 7 hrs ago Apple iPad 2024 ఆపిల్ కొత్త ఐప్యాడ్ల విడుదల మరింత ఆలస్యం.. కారణాలు ఇవేనా..??
- 8 hrs ago వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
Don't Miss
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
5జీ కోసం ఇండియాకి వల వేస్తున్న కంపెనీలు ఇవే..
4జీ రాకతో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
4జీ రాకతో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే..అయితే ఇప్పుడు 4జీకి కాలం చెల్లిపోయి 5జీ వైపు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 4జీ కన్నా అత్యంత వేగవంతమైన సర్వీసులను ప్రవేశపెట్టేందుకు దేశవిదేశాల్లోని టెక్నాలజీ సంస్థలు, టెల్కోలు వేంగా ముందుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు కంపెనీలు ఏకమై 5జీని తీసుకురావాలని కసరత్తులు చేస్తున్నాయి.
ఎయిర్సెల్ నుంచి ఏడాది ఆఫర్, ధర రూ. 104కే
5జీ టెక్నాలజీపై ఒప్పందం
తాజాగా దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్తో స్వీడన్ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్ 5జీ టెక్నాలజీపై ఒప్పందం చేసుకుంది. కాగా ఇప్పటికే నోకియా సంస్థ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్తోను, భారతి ఎయిర్టెల్తోను జట్టుకట్టిని విషయం తెలిసిందే.
దిగ్గజ టెల్కోలు ..
కాగా వెరిజోన్, కొరియా టెలికం, చైనా టెలికం, ఎన్టీటీ డొకొమో, వొడాఫోన్, ఎరిక్సన్, శాంసంగ్, స్ప్రింట్ మొదలైన దిగ్గజ టెల్కోలు ఈ నెట్వర్క్కు మళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.
వచ్చే ఏడాది జరగబోయే వింటర్ ఒలింపిక్స్లో..
ఇదిలా ఉంటే దక్షిణ కొరియాలోని ప్యోంగ్చాంగ్లో వచ్చే ఏడాది జరగబోయే వింటర్ ఒలింపిక్స్లో 5జీ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అక్కడి మొబైల్ ఆపరేటర్ కేటీ సన్నాహాలు చేస్తోంది.
చైనాలోని టెల్కోలు
చైనాలోని టెల్కోలు 2020 నాటికల్లా 5జీ సాంకేతికతకు సంబంధించి పనులు ప్రారంభించి 2025 నాటికల్లా ప్రపంచంలోనే అతి పెద్ద 5జీ మార్కెట్గా నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి.
2020 కల్లా 5జీని..
అటు దక్షిణ కొరియా, చైనా, జపాన్, బ్రిటన్, అమెరికా కూడా 2020 కల్లా 5జీని ప్రవేశపెట్టే అవకాశముంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా త్వరలోనే 5జీ నెట్వర్క్ను ప్రవేశపెట్టబోతున్నామంటూ కొనాళ్ల క్రితమే ప్రకటించింది.
5జీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ఇప్పటికే బెంగళూరులో 5జీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ల్యాబ్ ఏర్పాటు చేసిన నోకియా.. కొత్త తరం సాంకేతికతను మరింతగా వినియోగంలోకి తెచ్చే అంశాలపై దృష్టి పెడుతోంది. 5జీకి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను 2019లో ప్రకటించే అవకాశం ఉంది.
5జీ అభివృద్ధి కోసం రూ.500 కోట్ల నిధిని..
ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 5జీ అభివృద్ధి కోసం రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేయనుంది.
ట్రాయ్ కూడా 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియపై ..
2020కల్లా 5జీ నెట్వర్క్ను ప్రవేశపెట్టే దిశగా తగిన మార్గదర్శక ప్రణాళికను రూపకల్పన చేసేందుకు టెలికం విభాగం కార్యదర్శి సారథ్యంలో అత్యున్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నియంత్రణ సంస్థ ట్రాయ్ కూడా 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియపై దృష్టి పెడుతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470