రైతుల కోసం డ్రైవర్లెస్ ట్రాక్టర్లను లాంచ్ చేసిన ఎస్కార్ట్ లిమిటెడ్
వ్యవసాయ యంత్రాల వినియోగంలో కార్మికుల కొరత తీర్చేందుకు డ్రైవర్ లెస్ ట్రాక్టర్లును వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ఎస్కార్ట్ లిమిటెడ్ అందుబాటులోకి తెచ్చింది.వ్యవసాయానికి సాంకేతికతను జోడించే ప్రయత్నంలో భాగ
వ్యవసాయ యంత్రాల వినియోగంలో కార్మికుల కొరత తీర్చేందుకు డ్రైవర్ లెస్ ట్రాక్టర్లును వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ఎస్కార్ట్ లిమిటెడ్ అందుబాటులోకి తెచ్చింది.వ్యవసాయానికి సాంకేతికతను జోడించే ప్రయత్నంలో భాగంగా ఆటోమేటెడ్ ట్రాక్టర్ను గురువారం లాంచ్ చేసింది. ఈ డ్రైవర్ లెస్ ట్రాక్టర్లు చక్కటి పరిష్కారాలు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇందులో పలు వ్యయవసాయ అప్లికేషన్స్ తో పాటు విభిన్నంగా ఆపరేట్ చేసే విధంగా ఈ ట్రాక్టర్ ను రూపొందించారు.రానున్న రెండేళ్లలో ఎక్కువ సంఖ్యలో ఈ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తునట్టుఎస్కార్ట్ లిమిటెడ్ సంస్థ తెలిపింది.

డ్రైవర్లెస్ ట్రాక్టర్ను ఆపరేట్ చేసేందుకు....
డ్రైవర్లెస్ ట్రాక్టర్ను ఆపరేట్ చేసేందుకు మైక్రోసాఫ్ట్, రిలయన్స్ జియో, ట్రింబుల్, సంవర్ధన మదర్సన్ గ్రూప్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలతో జతకట్టినట్లు ఎస్కార్ట్ లిమిటెడ్ సంస్థ పేర్కొంది.

ఎలక్ట్రిక్ డ్రైవ్ లైన్ టెక్నాలజీ కోసం....
ఎలక్ట్రిక్ డ్రైవ్ లైన్ టెక్నాలజీ కోసం ఇన్ లైన్ ,ఎస్కార్ట్ లిమిటెడ్ AVL తో సహకరిస్తున్నాయి.

ఎస్కార్ట్ గ్రూప్ ఎండీ నిఖిల్ నందా మాట్లాడుతూ.....
ఈ స్మార్ట్ ట్రాక్టర్ దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులు చేస్తుందని తెలిపారు.

రానున్న రెండేళ్లలో....
రానున్న రెండేళ్లలో అధిక సంఖ్యలో ఈ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తునట్టు కంపెనీ తెలిపింది

కృత్రిమ మేథతో ట్రాక్టర్ను నడపడం ద్వారా....
కృత్రిమ మేథతో ట్రాక్టర్ను నడపడం ద్వారా రైతులకు శ్రమను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

అదే విధంగా మృత్తికా ఆరోగ్యం వంటి అంశాల్లో కూడా....
అదే విధంగా మృత్తికా ఆరోగ్యం, విత్తనాలు, నీటి యాజమాన్య వ్యవస్థ వంటి అంశాల్లో కూడా పురోగతి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్కార్ట్ యాజమాన్యం తెలిపింది. చిన్న, సన్నకారు రైతులకు చేదోడుగా నిలిచేందుకు వీలుగా ట్రాక్టర్లు, విత్తనాలు నాటే యంత్రాలను అద్దెకిస్తున్నామని పేర్కొంది.


Click it and Unblock the Notifications








