ఐరోపాను వణికిస్తోన్న Petya, హిట్లిస్ట్లో ఇండియా కూడా..
కంప్యూటర్లను లాక్ చేసి 300 డాలర్లు డిమాండ్ చేస్తున్న హ్యాకర్లు..?
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. Petya పేరుతో వన్నాక్రై కంటే ప్రమాదకరమైన ర్యాన్సమ్వేర్ను రూపొందించి ఐరోపా దేశాల పై దాడికి తెగబడ్డారు. ఈ దాడుల ప్రభావం భారత్ పై కూడా పడిందని సమాచారం. ఈ ర్యాన్సమ్ వేర్ కారణంగా యూరోప్ అంతటా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు మాల్వేర్ బారిన పడ్డాయని తెలుస్తోంది.

ఉక్రెయిన్ అతలాకుతలం...
Petya ర్యాన్సమ్వేర్ ప్రభావం, ఉక్రెయిన్లోని ప్రభుత్వ సంస్థలతో పాటు విద్యుత్ సరఫరా విభాగాలు, విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థలై తీవ్రంగా చూపినట్లు తెలుస్తోంది.

హిట్లిస్ట్లో ఇండియా కూడా..
రష్యా, ఇంగ్లాండ్ ఇంకా ఇండియాల్లో కూడా పెత్యా ప్రభావం ఉన్నట్లు స్విస్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ తెలిపింది.

యూజర్ ప్రమేయం లేకుండానే...
ఈ మాల్వేర్ యూజర్ ప్రమేయం లేకుండా దానంతటదే వ్యాపించేలా హ్యాకర్లు తీర్చిదిద్దారని సైబర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ మాల్వేర్ చూడటానికి
వైరస్ను తొలగించే ప్రోగ్రామ్లా ఉంటుందట.

300 డాలర్లు ఇవ్వండి..హ్యాకర్లు డిమాండ్
ఉక్రేనియన్ మీడియా కంపెనీ గ్లోబల్ వైర్ వెల్లడించిన వివరాల ప్రకారం మాల్వేర్ కారణంగా ఎఫెక్ట్ అయిన కంప్యూటర్ల నుంచి 300 డాలర్లను ( ఇండియన్ కరెన్సీలో రూ.19,300) బిట్ కాయిన్స్ రూపంలో హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముంబయి రేవులో మొరాయించిన కంప్యూటర్లు..
పెత్యా ర్యాన్సమ్వేర్ ప్రభావం ముంబయిలోని జవహర్ లాల్ నెహ్రూ ఓడరేవు పైనా పడినట్లు తెలుస్తోంది. ఇక్కడ మొత్తం మూడు టెర్మినల్స్ ఉండగా, వాటిలో ఒక టెర్మిన్లలోని కంప్యూటర్లు పూర్తిగా మెరాయించాయని సమాచారం. ముంబై ఓడరేపు పై జరిగిన Petya ర్యాన్సమ్వేర్ దాడికి సంబంధించి తమకు


Click it and Unblock the Notifications








