Just In
- 1 hr ago
Vivo Y20G కొత్త స్మార్ట్ఫోన్ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..
- 14 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
- 17 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 19 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
Don't Miss
- News
ట్రంప్ చివరి ప్రసంగం: బిడెన్ ప్రమాణ స్వీకారానికి డుమ్మా: వాషింగ్టన్కు గుడ్బై
- Movies
మోనాల్తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్గా.. ఊహించని విధంగా కామెంట్స్!
- Sports
ISL 2020 21: హైదరాబాద్కు మరో డ్రా!!
- Finance
వెనక్కి తగ్గాల్సిందే: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ, కేంద్రం ఘాటు లేఖ
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జియోతో సహా అన్ని టెల్కోలకు భారీ దెబ్బ, ఆ ఛార్జీలు సగం తగ్గింపు, ట్రాయ్ !
దేశీయ టెలికాం దిగ్గజాలకు ట్రాయ్ భారీ షాక్ ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంటర్ కనెక్టివిటీ ఛార్జీలపై ఇప్పటికే కిందా మీదా పడుతున్న టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, జియోలను ట్రాయ్ గట్టి దెబ్బనే కొట్టబోతోంది. అంతర్జాతీయ టర్మినేషన్ ఛార్జీలను సగానికి సగం తగ్గించే దిశగా ట్రాయ్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే టెలికాం దిగ్గజాలు మరింతగా ఆందోళనలోకి వెళ్లడం ఖాయంగా తెలుస్తోంది.
వాట్సప్లో ప్రమాదకర లోపం, డేంజర్ జోన్లో గ్రూపు చాటింగ్లు !

25 నుంచి 30 పైసలకు..
ఇప్పటికే మొబైల్ టెర్మినేషన్ కాల్ఛార్జీలను భారీగా తగ్గించిన ట్రాయ్, ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీలను కూడా భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిమిషానికి 53 పైసలుగా ఉన్న ఈ ఛార్జీలను 25 నుంచి 30 పైసలకు తగ్గించబోతున్నారని తెలుస్తోంది.

ట్రాయ్ బలమైన నిర్ణయం..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనధికార సమాచారం ప్రకారం ఈ విషయంపై ట్రాయ్ బలమైన నిర్ణయం తీసుకోనుందని నేడో రేపో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

మొబైల్స్, ల్యాండ్లైన్ కాల్స్ అన్నింటికీ..
కాగా ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీలను ఓ టెలికాం ఆపరేటర్, కాల్ టర్మినేట్ చేసే సర్వీసు ప్రొవైడర్కు చెల్లిస్తారు. మొబైల్స్, ల్యాండ్లైన్ కాల్స్ అన్నింటికీ ఈ ఛార్జీలను చెల్లిస్తారు. ఈ ఛార్జీను ఇంటర్నేషనల్ ఆపరేటర్ తన సబ్స్క్రైబర్ నుంచి రికవరీ చేసుకుంటారు.

40 పైసల నుంచి 53 పైసలకు..
2015 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ టర్మినేషన్ ఛార్జీలను నిమిషానికి 40 పైసల నుంచి 53 పైసలకు ట్రాయ్ పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో మొబైల్ టర్మినేషనల్ ఛార్జీలను మాత్రం నిమిషానికి 20 పైసల నుంచి 14 పైసలకు తగ్గించింది.

ఈ ఛార్జీలను మరింత కిందకు తీసుకురావాలని..
అయితే ఈ ఛార్జీలను మరింత కిందకు తీసుకురావాలని ట్రాయ్ సెప్టెంబర్ 19న టెలికాం దిగ్గజాలకు తెలిపింది. మొబైల్ టర్మినేషన్ ఛార్జీలను మరింత కిందకి 6 పైసలకు తీసుకురావడంతో పాటు ఈ ఛార్జీలను జీరో చేయాలని యోచిస్తున్నట్టు ట్రాయ్ ఆ సమయంలో పేర్కొంది.

ట్రాయ్ తాజాగా తీసుకోబోయే నిర్ణయంపై..
కాగా ట్రాయ్ తాజాగా తీసుకోబోయే నిర్ణయంపై ఇంటర్నేషనల్ టెలికాం సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజోన్ హర్షం వ్యక్తంచేస్తుంటే దేశీయ టెలికాం సంస్థలు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. ట్రాయ్ నిర్ణయంతో భారీ నష్టాల్లో కూరుకుపోవడం ఖాయమని,ట్రాయ్ ఈ విషయంపై ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190