ఫేస్‌బుక్ కొత్త ఆఫర్.. మొబైల్ ద్వారా లాగిన్ అయితే రూ.50 ఉచిత టాక్‌టైమ్!

By Prashanth
|
Facebook


ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్, ఇండియాలో తన యూజర్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్లగ్డుడ్. ఇన్ (Plugged.in) ప్రచురించిన సమాచారం మేరకు మొబైల్ ఫోన్ ద్వారా ఫేస్‌బుక్‌‌లోకి లాగిన్ అయ్యే కొత్త యూజర్‌కు రూ.50 టాక్‌టైమ్ ఉచితంగా లభించనుంది. ఫేస్‌బుక్‌ ఆకౌంట్‌ను తన మొబైల్ ద్వారా ఓపెన్ చేసుకున్న యూజర్ m.facebook.com/ttలోకి ప్రవేశించి సంబంధిత వివరాలున రిజిస్టర్ చేసి ఉచిత టాక్‌టైమ్‌ను పొందవచ్చు. ఫేస్ బుక్ లో ఇప్పటికే ఆకౌంట్ ఉన్న వారు తమ మిత్రులతో మొబైల్ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయించినట్లయితే వారికి ఫ్రీ టాక్‌టైమ్ వర్తిస్తుంది.

 

ఫేస్‌బుక్ యూజర్లు 100కోట్లు పైనే!, 60కోట్ల మంది మొబైల్ ద్వారానే?

 

న్యూయార్క్: ప్రపంచపు అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ఫేస్‌బుక్’ 100కోట్ల పై చిలుకు సభ్యులతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫేస్‌బుక్‌ను ప్రపంచవ్యాప్తంగా 200దేశాల్లో వినియోగించుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ అంశం పై స్పందించిన సంస్థ సహావ్యవస్థాపకులు, సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తమ సైట్ ద్వారా 100 కోట్ల మంది కమ్యూనికేషన్ బంధాలను సాగించటం ఆనందాశ్చర్యాలు కలిగించే అంశమని, నా జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణమని అభిప్రాయపడ్డారు.

2004లో ప్రారంభమైన ఫేస్‌బుక్ ఆరేళ్లలో 50 కోట్ల మైలురాయిని చేరుకోగా, ఆ తర్వాత రెండేళ్ల వ్యవధిలోనే అంతుకు రెట్టింపు స్థాయికి ఎదిగింది. ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారిలో 22 సంవత్సరాల వయస్కలు అధికం. ఫేస్‌బుక్‌కు భారత్‌లో 25 మిలియన్లకు పైగా సభ్యులున్నారు. బ్రెజిల్, ఇండియా, ఇండొనేషియా. మెక్సికో, అమెరకాలు దీనికి ఐదు అతిపెద్ద మార్కెట్లుగా పేరొందాయి. 60 కోట్ల మంది సభ్యులు తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా ఈ వెబ్‌సైట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. 2012లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన ఈ సంస్థ 100 మిలియన్ల డాలర్లమేర స్పందనతో భారీ ఐపీవోల్లో ఒకటిగా నిలిచింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X