Home
News

ఇన్‌స్టంట్ లోన్ ఫేక్ యాప్ ముఠా పట్టివేత!! క్రిప్టోకరెన్సీ ద్వారా 500 కోట్లు తరలింపు..

నకిలీ మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు ఇప్పించడం మరియు వినియోగదారుల యొక్క సున్నితమైన వ్యక్తిగత డేటాను ఉపయోగించి డబ్బును తిరిగి వసూలు చేయడం వంటి నకిలీ కార్యకలాపాలను నడుపుతున్న స్కామర్ల ముఠాను ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ చాలా తెలివిగా ఛేదించింది. రెండు నెలల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ఢిల్లీ పోలీసులు ఈ ముఠాతో సంబంధం ఉన్న 22 మందిని న్యూఢిల్లీ పరిసరాలలో అరెస్టు చేశారు. వీరు క్రిప్టోకరెన్సీని ఉపయోగించి మొత్తం డబ్బును చైనాకు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నకిలీ యాప్‌ల ద్వారా రూ.500 కోట్లు

ఈ ముఠా నకిలీ యాప్‌ల ద్వారా సుమారు రూ.500 కోట్లకు పైగా నగదును బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 100కి పైగా ఫోనీ లోన్ యాప్‌లు యాక్టివ్‌లో ఉన్నట్లు తెలిపారు. వీటి యొక్క సాయంతో ప్రజలను రూ.2,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు మోసగించారని పోలీసులు తెలిపారు. మరో మాటలో చెప్పాలంటే ఇలాంటి దోపిడీ కార్యకలాపాలను నడుపుతున్న స్కామర్‌లు మరింత మంది కూడా ఉండవచ్చు అని పోలీసుల యొక్క అనుమానం. ఈ యాప్‌ల యొక్క పేరులు ప్రస్తుతానికి అందుబాటులో లేవు కానీ అవి బ్లాక్ చేయబడి ఉండవచ్చు.

నకిలీ మొబైల్ యాప్‌లు ముఠా ఎలా బట్టబయలయింది

నకిలీ మొబైల్ యాప్‌లు ముఠా ఎలా బట్టబయలయింది

నకిలీ యాప్‌ల ద్వారా మోసపోయిన పలువురు బాధితులు ఈ ముఠాపై వ్యక్తిగతంగా మరియు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ మరియు ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా ఫిర్యాదు చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీరిలో ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టంట్ లోన్ యాప్‌ల గురించి ప్రస్తావించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్కామర్‌లు లోన్‌లను పంపిణీ చేసిన వారికి మార్ఫింగ్ చేసిన నగ్న ఫోటోలను ఉపయోగించి వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా వారి నుండి డబ్బును దోపిడీ చేస్తున్నారు. అరెస్టయిన నకిలీ యాప్‌ల ముఠా తమ స్థావరాలను తమ లక్ష్యాలను చేరుకోవడం కోసం పాకిస్తాన్ మరియు ఇతర పొరుగు దేశాలకు మార్చాలని యోచిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారు అనేక నకిలీ రుణ యాప్‌లను నడుపుతున్నందున వారు ఆన్‌లైన్ సర్వర్‌లను ఉపయోగించి తమ కార్యకలాపాలను పూర్తి చేసి వినియోగదారులను దోచుకున్నారు.

ఢిల్లీ పోలీస్‌ సైబర్ క్రైమ్

ఢిల్లీ పోలీస్‌ సైబర్ క్రైమ్

ఢిల్లీ పోలీస్‌లోని సైబర్ క్రైమ్ యూనిట్ DCP KPS మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం వివిధ పథకాల ద్వారా తక్షణ రుణాలను పొందడానికి ఈ యాప్‌లు వినియోగదారులను ఆకర్షిస్తాయి. వినియోగదారులు ధృవీకరించబడని వివరాల నుండి ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసిన తర్వాత వారు వినియోగదారుల యొక్క డేటాను యాక్సెస్ చేయడానికి మరియు వారి కాంటాక్ట్ వివరాలు, చాట్‌లు, ఫోటోలు మొదలైనవాటిని దొంగిలించడానికి వినియోగదారుల నుండి అనుమతిని పొందుతారు. ఈ యాప్‌లు ఈ డేటాను హాంకాంగ్‌లోని సర్వర్‌లకు పంపుతాయని ఆయన చెప్పారు. రికవరీ ఏజెంట్లుగా పేర్కొనబడిన ఈ ముఠా సభ్యులు యూజర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బును దోపిడీ చేయడానికి ఉపయోగిస్తారు.

ట్రాప్ ఎలా చేస్తారు

ట్రాప్ ఎలా చేస్తారు

రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు రుణం తీసుకునే వారిని మార్ఫింగ్ చేసిన ఫొటోలతో వారిని బెదిరించి లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. "సమాజానికి భయపడి చాలా మంది వినియోగదారులు డబ్బును చెల్లిస్తున్నారు. కానీ నిందితులు వీటిని కూడా బలవంతంగా వసూలు చేస్తున్నారు అని DCP మల్హోత్రా అన్నారు. ఈ దోపిడీకి సంబంధించి కొన్ని ఆత్మహత్య కేసులు కూడా నమోదు అయ్యాయి. వివిధ కేసులు, అన్ని దరఖాస్తులు, కాల్ వివరాల రికార్డులు మరియు ఆర్థిక లాగ్‌లను విశ్లేషించిన తర్వాత ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ యూనిట్ విచారణతో ముందుకు సాగింది.

పోలీసుల విచారణ

ఈ ముఠాకు సుప్రీత్ కె శెట్టి డైరెక్టర్ కాగా బీహార్‌కు చెందిన నవనీత్ కుమార్ భాటియా ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసాయి. చైనాలో చదువుకున్న భాటియా భారతదేశం నుండి పాకిస్తాన్ మరియు నేపాల్‌కు కాలింగ్ స్థావరాలను మార్చాలని యోచిస్తున్నాడు. డీసీపీ మల్హోత్రా ప్రకారం ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంటులు రోజుకు కోటి రూపాయల విలువైన క్రెడిట్ లావాదేవీలను చూపించాయి. ఢిల్లీ, హర్యానా, బీహార్, కర్నాటకలో విస్తృతంగా దాడులు నిర్వహించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Best Mobiles in India

English summary
Fake Instant Loan Apps Gang That Extorted Rs.500 Crore Arrested in Delhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X