పాకిస్తాన్కు చుక్కలు చూపించిన 5 ఇండియా అణ్వాయుధాలు
పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులతో విరుచుకుపడి 350 మంది వరకు ఉగ్రవాదులను హతమార్చింది. వీరిలో జైషే మహ్మద్ అగ్ర నేతలు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. ప
పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులతో విరుచుకుపడి 350 మంది వరకు ఉగ్రవాదులను హతమార్చింది. వీరిలో జైషే మహ్మద్ అగ్ర నేతలు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులతో విరుచుకుపడి 350 మంది వరకు ఉగ్రవాదులను హతమార్చింది.

అయితే ఇందులో ప్రధానంగా ఇండియా అమ్ములపొదిలో ఉన్న కొన్ని ఆయుధాలు తమ విశ్వరూపాన్ని చూపించాయి. మిరాజ్ 2000 అయితే ప్రధానంగా పతాక శీర్షికలకు ఎక్కింది.ఈ నేపథ్యంలో ఆయుధాలను ఓ సారి పరిశీలిస్తే..

హెరాన్
ఈ హెరాన్ డ్రోన్ విమానాన్ని ఇజ్రాయెల్ దేశాస్థులు తయారు చేశారు. వీటినే కాకుండా రక్షణ రంగానికి అనేక ఉత్పత్తులను వీరు సృష్టిస్తున్నారు. ఇలా గూఢఛార్యులను వెతికే డ్రోన్లను ప్రపంచ దేశాలకు అందిస్తోంది. అందులో భారత్ కూడా...ఈ రహస్య గగన విహంగంలో థర్మో గ్రాఫిక్ కెమెరా కలదు ఇది మానవ కదలికలను స్పష్టంగా సేకరించగలదు. మరియు వారి కదలికలు, ప్రయాణించే దిశ మరియు వారి శరీర ఉష్ణ్రోగ్రతలను లెక్కించి కంట్రోల్ రూమ్ వారికి సమాచారం చేరవేస్తుంది.కంట్రోల్ సెంటర్ నుండి సమాచారం అందిన తరువాత ఇది దుండగులను గుర్తించడానికి ఏ సమయంలోనైనా వెళ్లిపోతుంది. మరియు దీనిని ఇదే ఎంతో సులభంగా నియంత్రించుకుంటుంది.అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులలో కూడా ఇది చక్కగా ఎగురుతూ అందరిని పసిగడుతుంది. ఇంకా దీని ప్రత్యేకత, ఎటువంటి ఆపరేషన్స్లలో అయినా ఇది చురుకుగా అన్ని వేళల్లో పాల్గొంటుంది.ఈ హెరాన్ డ్రోన్ దాదాపుగా 52 గంటల పాటు గాలిలో ఎగరగలదు మరియు ఇది అత్యధికంగా 10.5 కిలీమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు.హెరాన్ డ్రోన్ 8.5 మీటర్ల పొడవు మరియు 16.60 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనిని దాదాపుగా 350 కిలో మీటర్లు వరకు నిరంతరాయంగా నడపవచ్చు.

Harpy
ఇజ్రాయెల్ దేశాస్థులు తయారు చేశారు. దీన్ని ఇండియా ఆర్మ్ డ్ ఫోర్స్ ఉపయోగిస్తోంది.రాడార్ సిస్టంను భస్మీపటలం చేయగలదు. దీన్ని ప్రపంచంలో అనేక దేశాలు వినియోగిస్తున్నాయి.

AEW&C:
Airborne early warning and control (AEW&C)ని DRDO డెవలప్ చేసింది. సెన్సార్ల నుండి వచ్చే డేటా తరంగాలను ఇది అడ్డుకుంటుంది. ఆర్మీకి ఈ తరంగాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది.

నిషాంత్
డీఆర్డీవో (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) చేసిన కృషి ఫలితంగా తయారైన తొలి దేశీయ మానవరహిత విమానం (యూఏవీ) ఇది. దీన్ని డీఆర్డీవో విభాగమైన ఏరోనాటికల్ డెవలప్ మెంట్ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) అభివృద్ధి చేసింది. దీన్ని మొబైల్ హైడ్రో-న్యూమాటిక్ లాంఛర్తో ప్రయోగిస్తే, పారాచ్యూట్ సహాయంతో తిరిగి పొందవచ్చు.ఇది గంటకు 125-150 కి.మీ.ల వేగంతో నాలుగున్నర గంటలు ప్రయాణిస్తుంది. శత్రు భూభాగంలోని సైనిక కదలికలపై నిఘా కోసం, లక్ష్యాలను గుర్తించడానికి, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ (ఈఎల్ఐఎన్టీ) సిగ్నల్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐజీఎన్ఐటీ) కి ఉపయోస్తారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఉపయోగించవచ్చు. చక్రాలతో కూడిన ఈ నిషాంత్ ను 'పంచి' అని పిలుస్తారు.

రుస్తోమ్
ఐఐఎస్సీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ 'రుస్తోమ్ దమానియా' కృషికి గుర్తింపుగా డీఆర్డీవో దీనికి రుస్తోమ్ అని నామకరణం చేసింది. ఇది మధ్యంతర ఎత్తులో అధిక కాలం ఎగిరే మానవ రహిత యుద్ధ గగనతల వాహనం. (ఎమ్ఏఎల్ఈ-యూసీఏవీ).రుస్తోమ్ అటానమస్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ (ఏటీవోఎల్) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రుస్తోమ్ -2 అమెరికాకు చెందిన ప్రిడేటర్ డ్రోన్లను పోలి ఉంటుంది. ఎల్ అండ్ టీ కంపెనీ రుస్తోమ్ -2 ను డీఆర్డీవో సహాయంతో మరింత ఆధునీకరించనుంది.


Click it and Unblock the Notifications








