Just In
- 1 hr ago రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 2 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 3 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 4 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
UPI apps వాడేవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు చాలా సులభతరమయ్యాయి.బ్యాంకులకు వెళ్లి గంటలు గంటలు క్యూ కట్టి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేకుండా క్షణాల్లో డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశాన్ని యుపిఐ పేమెంట్స్ కల్పిస్తున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్-యూపీఐ యాప్స్ ద్వారా అన్నిరకాల లావాదేవీలను చేస్తున్నారు.గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ కావడంతో అందరూ వాటినే ఆశ్రయిస్తున్నారు.
అయితే డిజిటల్ లావాదేవీలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాత్రం తేడా వచ్చినా అకౌంట్లోని డబ్బులు మాయమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.
పెరుగుతున్న లావాదేవీలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI డేటా ప్రకారం 2019 మార్చిలో 79.95 కోట్ల యూపీఐ లావాదేవీల్లో రూ.1.33 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. 2018 మార్చిలో 17.80 కోట్ల లావాదేవీల్లో రూ.24,172 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. యూపీఐ లావాదేవీలు ఏ స్థాయిలో పెరిగాయో ఈ లెక్కలు చూసి అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ నెలలో ట్రాన్సాక్షన్ డేటాను పరిశీలిస్తే.. గూగుల్ పే ట్రాన్సాక్షన్ విలువ రూ.49,700 కోట్లుగా ఉంది.
ఫోన్పే లావాదేవీల విలువ
అదేసమయంలో ఫోన్పే లావాదేవీల విలువ రూ.42,610 కోట్లుగా నమోదైంది. ఇక పేటీఎం లావాదేవీల విలువ రూ.35,500 కోట్లుగా ఉంది. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ప్లాట్ఫామ్స్పై జరిగిన లావాదేవీల విలువ రూ.1.42 లక్షల కోట్లు. ఇక ప్రభుత్వ పేమెంట్ యాప్ భీమ్ లావాదేవీల విలువ రూ.6,600 కోట్లుగా ఉంది. ఇంతలా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో సైబర్ మోసగాళ్లు తమ చేతికి పనిచెబుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీరికి దూరంగా ఉండండి
సాధారణంగా మోసగాళ్లు ఓఎల్ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని అమ్మేవారిని టార్గెట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ మనీ ఆప్షన్ ద్వారా డబ్బులు కొల్లగొట్టేస్తున్నారు. గతంలో కూడా ఓ మహిళ తనకు సంబంధించిన వస్తువును విక్రయానికి ఉంచగా అవతలి వ్యక్తి తెలివిగా ఆమెకు రిక్వెస్ట్ మనీ పెట్టి డబ్బులను గుంజాడు. సైబర్ ఛీటర్స్ 'రిక్వెస్ట్ మనీ' ఆప్షన్ని వాడుకుంటారు. అంటే మీ దగ్గర నుంచి డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్ పంపిస్తారు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి పిన్ ఎంటర్ చేశారంటే మీ అకౌంట్లోంచి డబ్బులు పోవడం ఖాయం. ఇక్కడే మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు డబ్బులు పంపాలంటే పిన్ అవసరం కానీ... మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవాలంటే పిన్ అవసరం లేదన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఈ మోసాలను గుర్తించిన గూగుల్ పే... కొత్త నెంబర్ నుంచి మనీ రిక్వెస్ట్ వస్తే స్పామ్ అని అలర్ట్ చేస్తోంది.
కంప్యూటర్ ద్వారా లావాదేవీలు
కంప్యూటర్ ద్వారా లావాదేవీలు చేసే సమయంలో Anydesk, Teamviewer, Screenshare లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉపయోగించకండి. అలాగే ఇతరులకు యాక్సెస్ ఇవ్వకండి. మొబైల్ ఫోన్లో కూడా స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడొద్దు. మీ స్క్రీన్ షేర్ చేస్తే ఓటీపీ ఇతరులు తెలుసుకోవడం చాలా సులువు. అంతేకాదు... ప్లేస్టోర్లో నకిలీ యాప్స్ కూడా ఉంటాయి. ఒక్క భీమ్ యాప్కే Modi Bhim, Bhim Modi App, BHIM Payment-UPI Guide, BHIM Banking guide, Modi ka Bhim లాంటి పేర్లతో నకిలీ యాప్స్ ఉన్నాయి. అందుకే యూపీఐ యాప్ ఏదైనా డౌన్లోడ్ చేసుకునే ముందు ఒరిజినల్ యాపేనా కాదా అని చెక్ చేయాలి.
వీపీఏ ఐడీ
యూపీఐ పేమెంట్స్ లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. మీరు యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసే సమయంలో వర్చువల్ పేమెంట్ అడ్రస్-VPA ఐడీ క్రియేట్ అవుతుంది. బ్యాంకుకు సంబంధించిన ఎలాంటి ఇతర సమాచారం లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సాధారణంగా మోసగాళ్లు వీపీఏ ఐడీ తెలుసుకొని మోసాలకు పాల్పడుతుంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వీపీఏ ఐడీ ఎవ్వరికీ చెప్పకూడదు.
ఓటీపి
ఏదైనా వస్తువుని ఆన్లైన్లో ఆర్డర్ చేసే క్రమంలో బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్లను టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. క్షణాల్లో గూగుల్ పే, పేటీఎం లాంటి ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించే వ్యాలెట్లను సృష్టిస్తున్నారు. లావాదేవీలు చేయడానికి అవసరమైన యూపీఐ నెంబర్ క్రియేట్ చేయడం కోసం ఒకే ఒక్కసారి ఓటీపీ అవసరం అవుతుంది. కేవలం దాన్ని తెలుసుకోవడం కోసమే సైబర్ నేరగాళ్లు బాధితులకు పోన్ చేస్తున్నారు. ఆర్డర్ ఓకే కోసం అని నమ్మించి ఓటీపీ తెలుసుకుంటున్నారు. నెంబర్ చెప్పగాలో అకౌంట్లోని డబ్బు గోవిందా. బాధితులు గుర్తించి అకౌంట్ని బ్లాక్ చేయించేంతవరకు అందినంత ఊడ్చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. అపరిచితుల ఫోన్ కాల్స్కు స్పందించొద్దని, ఎలాంటి వివరాలు అడిగినా చెప్పొద్దని సూచిస్తున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470