ఫ్లిప్కార్ట్ను బరిడీ కొట్టించిన ఇంజినీరింగ్ కుర్రోళ్లు, 152 ఫోన్లు స్వాహా
దొంగలించిన ఫోన్ల ఖరీదు రూ.1.05కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
షాపింగ్ పేరుతో ఫ్లిప్కార్ట్ను బురిడి కొట్టించి, 152 ఖరీధైన స్మార్ట్ఫోన్లను స్వాహా చేసిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను రాజస్థాన్ పోలీసులు రువారం జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. దొంగలించిన ఫోన్ల ఖరీదు రూ.1.05కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
Read More : ఇంటర్నెట్ స్పీడ్ను పెంచే 10 యాప్స్

పోలీసులు గుర్తించారు..
పట్టుబడిన వ్యక్తులను రాహుల్ మీనా (20), ధర్మరాజ్ మీనా (20)లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు గ్వాలియర్కు చెందిన వారు కాగా, మరొకరు జైపూర్ వాసి.

తెరవెనుక పెద్ద ముఠానే
తీగలాగితే డొంక మొత్తం కదిలినట్లు, వీళ్ల వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు ధర్యాప్తులో భాగంగా వెల్లడైంది. పట్టుబడిన వ్యక్తుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు 6 రోజుల రిమాండ్ను పోలీసులు కోరినట్లు సమాచారం.

ఫ్లిప్కార్ట్ జోనల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు..`
సెప్టంబర్ 24న, ఫ్లిప్కార్ట్ జోనల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఫ్లిప్కార్ట్ చెబుతోన్న వివరాల ప్రకారం...
ఈ ఘటనకు సంబంధించి ఫ్లిప్కార్ట్ చెబుతోన్న వివరాల ప్రకారం.. ధర్మరాజ్, రాహుల్లు నకిలీ పేర్లు, అడ్రస్లతో ఖరీదైన స్మార్ట్ఫోన్లను ఆర్డర్ చేసే వారు. ఫోన్లు అందిన తరువాత చాకిచక్యంగా ఆయా బాక్సుల నుంచి ఫోన్లను తీసేసి ఖాళీ బాక్స్ అందిందంటూ ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేసేవారు. దీంతో ప్రతిసారి రీఫండ్ లభిస్తూ ఉండేది. చాకిచక్యంగా కొట్టేసిన ఫోన్లను వేరొకరికి అంటగట్టి సొమ్మ చేసుకునే వాళ్లు.


Click it and Unblock the Notifications








