Flipkart Dussehra Specials Sale: స్మార్ట్ఫోన్ల కొనుగోలు మీద Flipkart లో ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు!!
ఇండియాలో ఫ్లిప్కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ అమ్మకం నిన్నటితో ముగిసాయి. ఈ అమ్మకాలు ముగిసిన వెంటనే ఫ్లిప్కార్ట్ తన అభిమానుల కోసం ప్రస్తుత దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని దసరా స్పెషల్స్ సేల్ ను కొత్తగా ప్రకటించింది. ఈ కొత్త సేల్ అక్టోబర్ 22 అంటే ఈ రోజు నుండి ప్రారంభమై అక్టోబర్ 28 వరకు కొనసాగుతుంది.

ఫ్లిప్కార్ట్ దసరా స్పెషల్స్ సేల్
ఫ్లిప్కార్ట్ యొక్క బ్యాక్-టు-బ్యాక్ అమ్మకాలలో స్మార్ట్ఫోన్ల కొనుగోలు మీద నో-కాస్ట్ EMI ఎంపికలు, ఎక్సచేంజ్ ఆఫర్స్ మరియు మొబైల్ ప్రొటెక్షన్ వంటి అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. ఈ అమ్మకంలో ఇ-కామర్స్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు HSBC బ్యాంక్ వినియోగదారులకు 10శాతం వరకు తక్షణ తగ్గింపును అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్కార్ట్ దసరా స్పెషల్స్ సేల్ లో స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్
ఫ్లిప్కార్ట్ యొక్క దసరా స్పెషల్స్ సేల్ లో స్మార్ట్ఫోన్ల కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. రియల్మి C3, ఐఫోన్ ఎస్ఇ (2020), ఐఫోన్ 11 ప్రో, రెడ్మి 8A డ్యూయల్ వంటి ఫోన్ల మీద ధరల తగ్గింపు లభిస్తున్నాయి. ఐఫోన్ 11 ప్రో యొక్క 64GB స్టోరేజ్ వేరియంట్ను దసరా అమ్మకంలో రూ.79,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 11 ప్రో యొక్క అధికారిక ప్రారంభ ధర రూ.1,06,600 కంటే ఇది రూ.26,601 ధర తక్కువ. దీనిని రూ.17,767 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ SE (2020) మీద డిస్కౌంట్ ఆఫర్లు
ఫ్లిప్కార్ట్ యొక్క దసరా స్పెషల్స్ సేల్ లో సరసమైన ధరలో లభించే ఐఫోన్ SE (2020) యొక్క 64GB బేస్ మోడల్ను రూ.7,501 తగ్గింపు ధరతో కేవలం రూ.34,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. సాధారణంగా దీనిని రూ.42,500 అధికారిక ధర వద్ద లభిస్తుంది. ఇవే కాకుండా ఫ్లిప్కార్ట్ లో నో-కాస్ట్ ఇఎంఐ డిస్కౌంట్లో భాగంగా నెలకు రూ.4,334 చెల్లించి కొనుగోలు చెయ్యవచ్చు. ఐఫోన్ SE 2020 ఫోన్ యొక్క 128GB వేరియంట్ ను ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు రూ.39,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

పోకో M2 ప్రో స్మార్ట్ఫోన్ మీద డిస్కౌంట్ ఆఫర్
ఫ్లిప్కార్ట్ దసరా స్పెషల్స్ సేల్ లో పోకో M2 ప్రో స్మార్ట్ఫోన్ ను రూ.1000 తగ్గింపు ధరతో కేవలం రూ.10,499 ధర వద్ద లభిస్తుంది. దీని యొక్క అసలు ధర రూ.11,999. ప్రీపెయిడ్ కొనుగోళ్ల మీద 1,000 రూపాయలు తగ్గింపు తరువాత వినియోగదారులు బేస్ మోడల్ ను రూ.9,999 ధర వద్ద పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్తో గరిష్టంగా రూ.14,050 వరకు తగ్గింపు పొందవచ్చు. పోకో ఎం 2 ప్రో స్మార్ట్ఫోన్ 6.67-అంగుళాల పూర్తి హెచ్డి + డిస్ప్లే మరియు 48 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్ మరియు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720Gచిప్సెట్ మరియు 6 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఫ్లిప్కార్ట్ దసరా స్పెషల్స్ అమ్మకంలో శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్
ఫ్లిప్కార్ట్ దసరా స్పెషల్స్ అమ్మకంలో రెడ్మి 8A డ్యూయల్ యొక్క 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ మోడల్ మీద రూ.500 డిస్కౌంట్ లభించిన తరువాత రూ.6,999 ధర వద్ద పొందవచ్చు. దీని యొక్క సాధారణ ధర రూ.7,499. ప్రీమియం మోడల్ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే శామ్సంగ్ గెలాక్సీ S20 + 8 జిబి + 128 జిబి ఆప్షన్ను రూ.49,999 ధర వద్ద నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికతో నెలకు రూ.5,556 చెల్లించి కొనుగోలు చెయవచ్చు. అదేవిధంగా శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10+ యొక్క 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ను EMI పద్దతిలో నెలకు రూ.6,667 చెల్లించి రూ.59,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








