సెప్టెంబర్ నుంచి మొబైల్ యాప్ ద్వారానే ఫ్లిప్కార్ట్

భారతదేశపు ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ ఫ్లిప్కార్ట్ తన అమ్మకాలను సెప్టంబర్ నుంచి మొబైల్ యాప్ ద్వారా మాత్రమే చేపట్టనున్నట్లు సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునిత్ సోని తెలిపారు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ను ఇంటర్నెట్ కనెక్షన్ను కలిగి ఉన్న డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోగలుగుతున్నాం.

Read More: ఈ 15 స్మార్ట్ఫోన్లు ఫ్లిప్కార్ట్లో మాత్రమే దొరుకుతాయ్!
అయితే, సెప్టంబర్ నుంచి మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి లాగినై షాపింగ్ చేయగలం. ఫ్లిప్కార్ట్ యాజమాన్యం గతంలోనే ఈ విధానాన్ని తెరమీదకు తీసుకువచ్చినప్పటికి, ఈ సెప్టంబర్ నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దరిదాపుగా 70శాతం మంది తమ వినియోగదారులు స్మార్ట్ఫోన్ల ద్వారా ఫ్లిప్కార్ట్ అకౌంట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications