కొత్త ట్రిక్ : ఇలా చేస్తే రూ.29కే 1జీబి 4G మీకు లభిస్తుంది..?
రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు భారతి ఎయిర్టెల్ ఆసక్తికర డేటా ప్యాక్లను మార్కెట్లో ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రూ.29 చెల్లించే 75 ఎంబీ 3G/4G డేటాను నెలంతా వాడుకునే అవకాశాన్ని ఎయిర్టెల్ కల్పిస్తోంది.

Read More : బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ల పై Amazon ఆఫర్లు ఇవే!
ఈ ఎంట్రీ లెవల్ ప్యాక్ను జాగ్రత్తగా వాడుకున్నట్లయితే రూ.29తో నెలమొత్తం ఆన్లైన్లో ఉండొచ్చు. అయితే ఓ కొత్త ట్రిక్ను అప్లై చేయటం ద్వారా అదే రూ.29కి మరో రూ.96ను జోడించటం ద్వారా నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 3G లేదా 4G డేటాను మీ సొంతమవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం...

#1
28 రోజుల వ్యాలిడిటీతో కూడిన రూ.29 ఎయిర్టెల్ 1జీబి 3G/4G డేటా ప్యాక్ను మీ ఫోన్లో పొందాలంటే ముందుగా మీరు రూ.96 పెట్టి రీఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ రీచార్జ్ను మీరు ఏ దుకాణంలోనైనా చేయించుకోవచ్చు.

#2
మీ ఎయిర్టెల్ నెంబర్కు రూ.96 రీచార్జ్ విజయవంతమైన తరువాత అదే ఫోన్ నుంచి *121*111# నెంబర్కు డయల్ చేయండి.

#3
ఇప్పుడు మీ ఫోన్ డిస్ప్లే పై ఓ పాపప్ మెనూ ప్రత్యక్షమవుతంది. అందులో రూ.29 ప్యాక్ను మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

#4
ఈ యాక్టివేషన్ పూర్తవ్వాంటే ఖచ్చితంగా మీ ఎయిర్టెల్ మెయిన్ అకౌంట్లో రూ.29 మినిమమ్ బ్యాలన్స్ ఉండాలి. ఎందుకంటే మీ మెయిన్ అకౌంట్ నుంచే బ్యాలన్స్ డిడక్ట్ అవుతుంది.

#5
ఈ ప్రాసెస్ విజయవంతమైన వెంటనే ఎయిర్టెల్ నుంచి మీకో confirmation మెసేజ్ అందుతుంది. ఈ మెసేజ్లో 75ఎంబీ 3జీ డేటా మీ అకౌంట్లో క్రెడిట్ అయినట్లు చూపెడుతుంది కంగారపడకుండా మరో సారి మీ డేటా బ్యాలన్స్ను చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ అకౌంట్ బ్యాలన్స్ 1.1జీబిగా చూపెడుతుంది. 30 రోజుల వ్యాలిడిటీ కూడా మీకు లభిస్తుంది.


Click it and Unblock the Notifications