Just In
- 10 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 12 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 12 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 15 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఫ్లిప్కార్ట్కు రూ.7 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన విద్యార్థులు
ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ తోనే అన్నీ పనులు జరిగిపోతున్నాయి. ఈ బిజీ బిజీ లైఫ్ లో కాళ్లు బయట పెట్టకుండానే అన్ని ఒడిలోకి వచ్చిపడుతున్నాయి.
ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ తోనే అన్నీ పనులు జరిగిపోతున్నాయి. ఈ బిజీ బిజీ లైఫ్ లో కాళ్లు బయట పెట్టకుండానే అన్ని ఒడిలోకి వచ్చిపడుతున్నాయి. ప్రజలు బయటికి వెళ్లకుండానే ఆన్ లైన్ లో షాపింగ్ చేసేస్తున్నారు. చేతిలొ ఫోన్ ఉంటే చాలు ఎలాంటి వస్తువు అయినా తెల్లారేసరికల్లా ఇంటి ముందుకు వచ్చేస్తోంది. అయితే కొన్నిసార్లు ఆన్ లైన్ షాపింగ్ లో మోసాలు కూడా జరుగుతుంటాయి.బుక్ చేసిన ప్రొడక్ట్ కాకుండా ఇతర డమ్మి ప్రొడక్ట్ లు వినియోగదారులకి అందుతున్నాయి. దీంతో ఈ ఆన్ లైన్ షాపింగ్ తో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ కామర్స్ సైట్లు కూడా ఇందుకు మినహాయంపు ఏమి కాదు. అందులో పనిచేసేవారు కస్టమర్ల బుక్ చేసిన ఉత్పత్తులను కాకుండా వేరే వాటిని వారికందిస్తున్న సంఘటనలు రోజూ సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటు చేసుకుంది. 39 మంది ఫ్లిప్ కార్ట్ కు ఏకంగా రూ. 7 కోట్లు టోపీ పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే......
గుజరాత్ మెహసానా, పటాన్, అహ్మదాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన:
గుజరాత్ మెహసానా, పటాన్, అహ్మదాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ 39 మంది ఫ్లిప్ కార్ట్ ఖాతాదారులకు ఆర్డర్ ను రద్దు చేసి, వారు తిరిగి చెల్లింపు మొత్తాన్ని ఫ్లిప్ కార్ట్ ద్వారా ఒకసారి SBI బ్యాంకు ద్వారా ఒకసారి తీసుకొని రెట్టింపు చేసుకున్నారు.
ఎక్కువగా విద్యార్దులే :
ఈ కుట్రలో పాలుపంచుకున్నవారు ఎక్కువుగా విద్యార్థులే గమనార్హం. తమకు కావాల్సిన వస్తువును కొనుగోలు చేయడానికి ఫ్లిప్ కార్ట్ ద్వారా క్రెడిట్ పొందేవారు వారి అకౌంట్ లోకి అదే డబ్బులు వారి SBI బ్యాంకు అకౌంట్ లో జమ అయ్యేది.వినియోగదారులు డబ్బును రెట్టింపు చేసుకుంటున్నారని తెలుసుకున్నప్పటి నుంచి వారు మళ్లీ మళ్లీ అదే ప్రక్రియను రిపీట్ చేసేవారు.
విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా:
విద్యార్థుల నుండి వారి కుటుంబం సభ్యులు మరియు బంధువులకు ఈ విషయం విస్తరించింది, వాళ్ళు కూడా ఫ్లిప్ కార్ట్ నుండి ఆర్డర్లను బుక్ చేయడం మరియు రద్దు చేయటం మొదలుపెట్టారు. అయితే మొత్తంగా 39 SBI అకౌంట్స్ నుంచి 1,090 ట్రాన్సక్షన్స్ జరిగాయి దగ్గర దగ్గర 7 కోట్లు దాకా ఫ్లిప్ కార్ట్ కు టోపీ పెట్టారు.
మాస్టర్ కార్డు , వీసా లేదా రూపీ :
ఆన్ లైన్ లావాదేవీ రద్దులలో, కొనుగోలుదారులకు వ్యాపారుల నుంచి తిరిగి చెల్లించడం జరిగేది. మాస్టర్ కార్డు , వీసా లేదా రూపీ వంటి చెల్లింపు మాస్టర్స్ నుండి నిధులు మరియు సలహాలను అందుకునేవారు.అయితే వీసా క్రొత్త ఆన్ లైన్ రీఫండ్ ప్రాజెక్ట్ ను తెచ్చింది , డబ్బు నేరుగా వినియోగదారులకు క్రెడిట్ అయ్యే విధంగా తీసుకొచ్చింది .
దర్యాప్తు జరుగుతోంది:
పాత మరియు కొత్త వ్యవస్థ యొక్క ఓవర్ ల్యాప్ కారణంగా ఈ సమస్య తలెత్తింది అని ఫ్లిప్ కార్ట్ చెబుతుంది.కాగా ఈ కేసును SBI మోసంగా వ్యవహరించింది.దీని పై ఇంకా దర్యాప్తు జరుగుతోంది. SBI జారీ చేసిన నివేదిక ప్రకారం, డిసెంబర్ త్రైమాసికంలో, బ్యాంక్లో మోసం కేసులు 40 శాతం పెరిగాయి మరియు ఈ కేసులలో పాల్గొన్న మొత్తాలు 324 శాతం పెరిగాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470