ఇంటర్నెట్ సర్వీస్లను ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్!
రైలు ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేస్తూ ఇండియన్ రైల్వే శాఖ వై-ఫై ఆధారిత ఇంటర్నెట్ సేవలను మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభించింది. తొలిగా ఈ సదుపాయాన్ని న్యూఢిల్లీ - హౌరా రాజధాని ఎక్స్ప్రెస్ (12302) అందుకుంది. మరో 50 రైళ్లలో ఈ తరహా ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా రైలు ప్యాసెంజర్లు ప్రయాణంలోనూ నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. ఈమెయిల్ యాక్సిస్, యూట్యూబ్, ఆన్లైన్ గేమింగ్ వంటి వెబ్ ఆధారిత కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.

ఇంటర్నెట్ డౌన్లోడ్ బ్యాండ్ విడ్త్ 4 ఎంబీపీఎస్ గాను, అప్లోడ్ బ్యాండ్ విడ్త్ 512కెబీపీఎస్గాను ఉంటుంది. రైల్వే శాఖా మంత్రి పవన్ కుమార్ బన్సాల్ ఈ సర్వీస్లను ప్రారంభించారు.


Click it and Unblock the Notifications








