Free Wi-Fi సర్వీస్ రైల్వే స్టేషన్లలో : గూగుల్ అవుట్... రైల్టెల్ ఇన్...
దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై కనెక్టివిటీని అందించడానికి రైల్టెల్తో కుదుర్చుకున్న ఐదేళ్ల ఒప్పందం ముగియనున్నట్లు గూగుల్ ఇండియా ప్రకటించింది. అయితే రైల్వే స్టేషన్లలో ఇక మీదట ఉచిత వై-ఫై కనెక్టివిటీ ఉండదని దీని అర్థం కాదు.

ఉచిత వై-ఫై సేవలు ప్రస్తుతం అందిస్తున్న అదే వేగం మరియు నెట్వర్క్ యొక్క అదే నాణ్యతతో కొనసాగుతాయని రైల్టెల్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

గూగుల్తో రైల్టెల్ ఒప్పందం
గూగుల్తో రైల్టెల్ యొక్క ఐదేళ్ల ఒప్పందం మే 2020 తో ముగుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 415 రైల్వే స్టేషన్లలో రైల్టెల్ ఉచిత వై-ఫై కనెక్టివిటీని అందించడం కోసం ఐదేళ్ల కిందట గూగుల్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియాలోని 415 స్టేషన్లలో 5190 బి, సి, డి స్టేషన్లతో పాటు ఉచిత వై-ఫైను అందిస్తూనే ఉంటామని రైల్టెల్ స్పష్టం చేసింది. ఉచిత వై-ఫై కనెక్టివిటీ ప్రయాణంలో అనేక మందితో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైల్టెల్ దేశవ్యాప్తంగా 5,600+ స్టేషన్లలో ఉచిత వై-ఫైను అందిస్తోంది అని రైల్టెల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

గూగుల్ ఇండియా కేవలం 415 A1, ఎ, సి కేటగిరీ స్టేషన్లకు మాత్రమే ఉచిత వై-ఫై కనెక్టివిటీ టెక్నాలజీని అందించడానికి ఒప్పందం చేసుకున్నట్లు రైల్టెల్ స్పష్టం చేసింది. ఈ భాగస్వామ్యంలో గూగుల్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ (RAN) మరియు టెక్నాలజీ సపోర్ట్ను అందించింది. రైల్టెల్ భౌతిక మౌలిక సదుపాయాలు మరియు ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ను అందించింది అని రైల్టెల్ తెలిపింది. ఇప్పుడు ఇది రైల్టెల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ (ISP) గా కొనసాగుతోంది.

వై-ఫై కనెక్టివిటీ
వై-ఫై కనెక్టివిటీ తరువాత రైల్టెల్ ఇప్పుడు 2022 నాటికి రైళ్లలో మరియు రైల్వే స్టేషన్లలో కంటెంట్ ఆన్ డిమాండ్ (COD) సేవలను అందించాలని చూస్తోంది. ఇందులో భాగంగా సినిమాలు, టీవీ షోలు, విద్యా కార్యక్రమాలు మొదలైనవి ఉచిత మరియు చెల్లింపు మోడ్ లలో అందుబాటులో ఉంచబడతాయి. చెల్లింపు ప్రక్రియతో భారతీయ రైల్వే ఛార్జీల రూపంలో కాకుండా మరొక రూపంలో ఆదాయాన్ని సంపాదించాలని చూస్తోంది.

ఛార్జీల రహిత రూపంలో మరింత ఆదాయాన్ని సంపాదించే లక్ష్యంతో రైళ్ళలో ప్రయాణీకులకు కంటెంట్ ఆన్ డిమాండ్ సేవలను అందించడంతో రైల్వే బోర్డు రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని మినరత్నా PSU రైల్టెల్ను అప్పగించింది అని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఉచిత వై-ఫై కనెక్టివిటీ ప్రాజెక్ట్
ఉచిత వై-ఫై కనెక్టివిటీ ప్రాజెక్ట్ భారతదేశం అంతటా 3003 రైళ్లు (ప్రీమియం / మెయిల్ / ఎక్స్ప్రెస్- టు అండ్ ఫ్రో) మరియు 5728 సూపర్ ఫాస్ట్ రైళ్లలను కలిపి మొత్తంగా 8731 రైళ్లలో కలిగి ఉంటుంది.మీడియా సర్వీస్ అన్ని వై-ఫై ఎనేబుల్డ్ రైల్వే స్టేషన్లలో కూడా లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ మొత్తంగా 5563 రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంది అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.


Click it and Unblock the Notifications