కొత్త ఫీచర్లతో సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్లు!
ఇండియాలో రిలీజ్ కానీ గెలాక్సీ జే7 మ్యాక్స్
సామ్ సంగ్ గెలాక్సీ j7 ప్రొ , గెలాక్సీ జే7 మ్యాక్స్ పేర్లతో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్ లను ఇండియాలో జూన్ లో లాంచ్ చేసింది. గెలాక్సీ జే7 ప్రో ధర రూ. 20.990. గెలాక్సీ జే7మ్యాక్స్ ధర రూ. 17,900లుగా ప్రకటించింది.

కొద్ది రోజుల క్రితమే గెలాక్సీ జే7మ్యాక్స్ అందుబాటులోకి వచ్చింది. కానీ గెలాక్సీ జే7ప్రో విడుదల ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు...ఇండియాలో సేల్ చేసేటట్లు కనిపిస్తుంది. గెలాక్సీ జే7ప్రో గెలాక్సీ జే7 64జిబి స్టోరేజీ కెపాసిటి కలిగి ఉన్నాయి. ఇక సామ్ సంగ్ పే ..ఎక్కువ రోజుల పాటు హై ఎండ్ , ఫ్లాగ్షిప్ డివైస్ కోసం ఉద్ధేశించబడింది.
గెలాక్సీ జే7ప్రో ధర రూ. 20,990. అయితే అమెజాన్ ద్వారా అధిక ధరతో అందుబాటులో ఉంది. సామ్ సంగ్ అన్ లైన్ స్టోర్, ఇండియాలోని అమెజాన్ లో గెలాక్సీ జే7ప్ అమ్మకం జాబితాను ప్రకటించారు. 20,990 , 22,300. సామ్ సంగ్ ఆన్ లైన్ స్టోర్ లీస్టింగ్ లో స్మార్ట్ ఫోన్ స్టాక్ లేదు. మరోవైపు గెలాక్సీ జే7ప్రో అమెజాన్ ఇండియా జాబితా అధిక ధరలో మాత్రమే గోల్డ్ వేరియంట్ ను విక్రయిస్తుంది.
ప్రస్తుతానికి గెలాక్సీ జే7ప్రో ఆఫ్ లైన్లో కొనుగోలు చేసేందుకు స్టాక్ లేదు. రానున్న కొన్ని రోజుల్లో బ్లాక్ వేరియంట్ లో మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది. గెలాక్సీ జే7 ప్రో స్పెసిఫికేషన్స్ ..
5.5అంగుళాల ఫుల్ హెచ్ డి, 1080పిక్సెల్స్ రిజల్యూషన్ , సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే. ఆక్టాకోర్ Exynos7870 soc పేయిర్డ్.3జిబి ర్యామ్ , 64జిబి స్టోరేజీ కెపాసిటి. ఆండ్రాయిడ్ 7.0నౌగట్ తో రన్ అవుతుంది. వీటితోపాటు 4జి LTE , డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








