క్షణాలలో పాన్ కార్డు పొందే అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం
పాన్ కార్డును పొందడానికి చాలా రోజుల సమయం పడుతుంది అని బాధపడుతున్నారా. అటువంటి సమస్య మీకు త్వరలోనే తీరబోతున్నది. కేవలం మీ యొక్క ఆధార్ వివరాలను ఆన్లైన్ లో అందజేయడం ద్వారా పాన్ కార్డులను తక్షణమే జారీ చేసే సదుపాయాన్ని ప్రభుత్వం ఈ నెలలో రూపొందిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు.

పాన్ కార్డు కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వివరణాత్మక దరఖాస్తు ఫారమ్ నింపకుండా శాశ్వత పాన్ కార్డు అకౌంట్ నెంబర్ ను కేవలం ఆధార్ ఆధారంగా ఆన్లైన్లో తక్షణమే కేటాయించే వ్యవస్థను ప్రభుత్వం 2020-21 బడ్జెట్ లో ప్రతిపాదించింది.

ఈ సదుపాయం ఇప్పుడు నిర్మాణాత్మక దశలో ఉన్నందున వీలైనంత త్వరగా ఈ నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభించబడుతుందని పాండే తెలిపారు. ఈ సదుపాయం కింద తెలిపే మూడు దశల వారిగా పనిచేస్తుంది.
*** పాన్ కార్డును పొందాలి అనుకున్న వారు ఆదాయపు పన్ను శాఖ యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేయాలి.
*** వెబ్సైట్ను ఓపెన్ చేసిన తరువాత అందులో మీ యొక్క ఆధార్ నంబర్ను నమోదు చేయాలి.
*** ఆధార్ ను దృవీకరించడానికి మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వన్టైమ్ పాస్వర్డ్ (OTP) ను పంపబడుతుంది. ఆధార్ వివరాలను ధృవీకరించడానికి ఈ OTP ఉపయోగపడుతుంది.
*** OTP ఎంటర్ చేసిన తరువాత ఆధార్ యొక్క వివరాలను అనుసరించి మీకు తక్షణమే పాన్ కార్డు కేటాయించబడుతుంది.
*** మీకు కేటాయించిన ఇ-పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వం నిర్ణయం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పన్ను చెల్లింపుదారుడు దరఖాస్తు ఫారమ్ నింపి ఆదాయపన్ను శాఖకు సమర్పించడంలో ఉన్న ఇబ్బంది నుండి బయటపడటానికి సహాయపడుతుంది. వినియోగదారుడి యొక్క నివాస చిరునామాకు పాన్ కార్డులను పంపే ప్రక్రియను కూడా మరింత సులభతరం చేస్తుంది.

పాన్-ఆధార్ అనుసంధానం
ప్రభుత్వం ఇప్పటికే పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. ఇప్పటికే 30.75 కోట్ల మందికి పైగా తమ పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానించారు. అయితే జనవరి 27, 2020 నాటికి 17.58 కోట్ల మందికి పైగా ఇంకా తమ పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానించలేదు అని తేలింది.

పాన్-ఆధార్ అనుసంధానానికి చివరి తేదీ మార్చి 31, 2020. పన్ను చార్టర్ను పాటించకపోతే ముందుకు వెళితే వారికి జరిమానా విధించబడుతుందని అధికారి తెలిపారు. "మొత్తం ఉద్దేశ్యం 'మనకు ట్రస్ట్-బేస్డ్ సిస్టమ్ ఉండాలి', ఇక్కడ నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను వేధించకూడదు, మనకు కనీస మాన్యువల్ ఇంటర్ఫేస్ ఉండాలి, చాలావరకు ఆన్లైన్లో సమస్యను పరిష్కరించాలి. మొత్తం వ్యవస్థ చాలా సరళంగా ఉండాలి.

2020-21 బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2020-21 బడ్జెట్ ప్రసంగంలో "ఈ దేశంలో సంపద సృష్టికర్తలు గౌరవించబడతారని మరియు జీవన సౌలభ్యం మరియు వ్యాపార సౌలభ్యాన్ని నిర్ధారించడానికి పన్ను పరిపాలన యొక్క సరసత మరియు సామర్థ్యాన్ని కలిగి ఉండటం చాలా అవసరం అని అన్నారు.

"ఈ బడ్జెట్ ద్వారా 'పన్ను చెల్లింపుదారుల చార్టర్'ను చట్టాలలో పొందుపరచాలని మేము కోరుకుంటున్నాము. మా పౌరులు ఎలాంటి వేధింపుల నుండి విముక్తి పొందేలా చర్యలు తీసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నామని పన్ను చెల్లింపుదారులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాము" అని ఆమె చెప్పారు.


Click it and Unblock the Notifications








