ఒలంపిక్ సంబరం (నేటి గుగూల్ హోమ్ పేజీ ప్రత్యేకత)

విశ్వక్రీడగా గుర్తింపుతెచ్చుకున్న ఒలింపిక్స్కు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ సెర్చ్ ఇంజన్ గుగూల్ నేటి హోమ్ పేజీని ఒలింపిక్స్ శోభతో నింపేసింది. లండన్లో ఈ క్రీడల ఆరంభోత్సవాన్నిపురస్కరించుకుని ఒలింపక్ లోగోను నేటి డూడూల్గా గుగూల్ ప్రతిష్టించింది. వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు అథ్లెట్లను ఈ డూడూల్ పై చూడొచ్చు. ఈ 30వ ఒలింపిక్ క్రీడ 19 రోజుల పాటు జరగనుంది. పోటీలో జరిగే క్రీడాంశాల సంఖ్య 26, పాల్గొనున్న క్రీడాకారులు సంఖ్య 10,500, పతక విభాగాలు 302, క్రీడా వేదికలు 34, పాల్గొంటున్నదేశాలు 204. ఈ క్రీడల్లో భారత్ నుంచి 81 మంది క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పంచరింగుల క్రీడా పండుగకు లండన్ ఇప్పటిచే రెండుసార్లు అతిధ్యమిచ్చింది.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








