ఢిల్లీ ఘటనకు గూగుల్ నివాళి!

సభ్యసమాజం తలదించుకునేలా ఆరుగురు మానవ మృగాల చేతిలో అత్యంత కీరాతకంగా అత్యాచారానికి గురై అసువులు బాసిన భరతమాత ముద్దు బిడ్డ ధామినికి సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ నివాళులర్పించింది. ‘ఇన్ ద మెమరీ ఆఫ్ ఢిల్లీ బ్రేవ్ హార్ట్’అనే ట్యాగ్లైన్తో ఓ క్యాండిల్ను తన హోమ్ పేజీలో ఉంచింది. ఈ ఉదంతానికి సబంధించి వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీ ప్రాంతానికి చెందిన 23ఏళ్ల వైద్య విద్యార్థిని ధామిని డిసెంబర్ 16 (ఆదివారం రాత్రి) ఆరుగురు కీచక కామాంధుల చేతిలో హత్యాచారానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమోను మెరుగైన వైద్యసేవల నిమిత్తం సింగపూర్ తరలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. 13 రోజుల చావుబతుకుల పోరటంలో అంతిమంగా ఆమె ఓడిపోయింది. శనివారం తెల్లవారుజామున 2.15 నిమిషాలకు ధామిని తుదిశ్వాస విడిచారు.


Click it and Unblock the Notifications








