పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్లకు 3జీ డేటా ఆఫర్లు:
3జీ సర్వీసులను ఉపయోగించుకుంటున్న పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ ప్ర్యత్యేక రాయితీలను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్లో భాగంగా ప్రీపెయిడ్ ఎస్టీవీ రూ.250, పోస్ట్ పెయిడ్ ఎఫ్ఎమ్సీ రూ.220 పై 10శాతం రాయితీని ప్రకటించింది. అదే విధంగా ప్రీపెయిడ్ ఎస్టీవీ రూ.450, పోస్ట్పెయిడ్ ఎఫ్ఎమ్సీ రూ.400 పై 10శాతం రాయితీని ప్రకటించింది.ఈ ఆఫర్ నేటి నుంచి 90 రోజులు పాటు ఉంటుంది.