స్మార్ట్ఫోన్ ద్వారా MBA కోర్సు చేయవచ్చు
లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. భారత్లోని విద్యార్థులు స్మార్ట్ఫోన్ ద్వారా ఎంబీఏ కోర్సు చేసే విధంగా స్మార్ట్ఫోన్ ఎంబీఏ ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది. ఈ-లెర్నింగ్కు క్రమంగా ప్రాధాన్యత పెరుగుతోన్న నేపథ్యంలో లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ ఈ కొత్త ఒరవడికి నాంది పలికింది. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యూకే బేసిడ్ విద్యాసంస్థ తన స్మార్ట్ఫోన్ ఎంబీఏ ప్రోగ్రామ్ కోసం ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను డిజైన్ చేయించుకుంది. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్లో..
Read More : రూ.50,000 ఫోన్తో పోటీ పడుతున్న రూ.20,000 ఫోన్
కోర్సును అభ్యసించే క్రమంలో విద్యార్థులు స్మార్ట్ఫోన్ ద్వారా ట్యూటర్లతో ఇంటరాక్ట్ కావొచ్చు. అంతేకాదు, తమకు కావల్సిన బుక్స్ ఇంకా స్టడీ మెటీరియల్ను నేరుగా మొబైల్ ఫోన్ ద్వారా పొందాల్సి ఉంటుంది. సహ విద్యార్థులతో చాట్ చేసుకునేందుకు ఓ కమ్యూనిటీ ఫోరమ్ను ఏర్పాటు చేసారు. ఈ వినూత్న విధానం ద్వారా సమయం ఇంకా ప్రదేశంతో సంబంధం లేకుండా లెర్నర్స్ తమ కోర్సును పూర్తి చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన నాటి నుంచి వందల మంది స్టూడెంట్స్ తమని అప్రోచ్ అవుతున్నారని లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ తెలిపింది. లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్, స్మార్ట్ఫోన్ ద్వారా ఆఫర్ చేస్తున్నఎంబీఏ కోర్సులలో మాస్టర్స్తో పాటు రెండు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. ప్రొఫెషనల్ మార్కెటింగ్ కోర్సును కూడా స్మార్ట్ఫోన్ల ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. డిచిన 18 నెలలుగా 48 లోకల్ యాక్సెస్ పాయింట్లను సెటప్ చేసింది. పాయింట్స్ వద్ద స్టూడెంట్స్ కలుసుకుని తమ కోర్సు వర్క్ ను ప్రిపేర్ చేసుకునే వీలుంటుంది.
స్మార్ట్ఫోన్ ద్వారా MBA కోర్సు చేయవచ్చు

స్మార్ట్ఫోన్ ద్వారా MBA కోర్సు చేయవచ్చు

స్మార్ట్ఫోన్ ద్వారా MBA కోర్సు చేయవచ్చు

స్మార్ట్ఫోన్ ద్వారా MBA కోర్సు చేయవచ్చు

స్మార్ట్ఫోన్ ద్వారా MBA కోర్సు చేయవచ్చు

స్మార్ట్ఫోన్ ద్వారా MBA కోర్సు చేయవచ్చు

స్మార్ట్ఫోన్ ద్వారా MBA కోర్సు చేయవచ్చు

స్మార్ట్ఫోన్ ద్వారా MBA కోర్సు చేయవచ్చు


Click it and Unblock the Notifications