దుబాయ్లో అబ్బాయ్.. ఇండియాలో అమ్మాయ్, పెళ్లి మాత్రం ఆన్లైన్లో
ఈ రోజుల్లో టెక్నాలజీ ఉపయోగం చాలా పెరిగిపోయింది ఏ వస్తువు కావాలన్న ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నాం. వస్తువులు కొనుగోలు చేయడం వరకు బాగానే ఉంది కానీ పెళ్లిళ్లు కూడా ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి.
ఈ రోజుల్లో టెక్నాలజీ ఉపయోగం చాలా పెరిగిపోయింది ఏ వస్తువు కావాలన్న ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నాం. వస్తువులు కొనుగోలు చేయడం వరకు బాగానే ఉంది కానీ పెళ్లిళ్లు కూడా ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో డేటింగ్ లు మీటింగ్ లు వరకే చూసి ఉంటాం కానీ ఇప్పుడు నిశ్చితార్థలు పెళ్లిళ్లు కూడా ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి. ముందుముందు ఆన్ లైన్ లో ఇంకా ఎన్ని గోరాలు చూడాల్సి వస్తుందో.... అసలు స్టోరీలోకి వెళ్తే

రమ్జాన్ అలీ కి,అక్బరీ ని ఇచ్చి పెళ్లి చేయాలనీ పెద్దలు నిశ్చయించుకున్నారు....
యూపీలోని గోండాకు చెందిన రాధాకుండ్ ప్రాంతంలో ఉండే మహ్మద్ అలీమ్, తన కుమార్తె అక్బరీ ని కర్నౌల్జంగ్ ప్రాంతానికి చెందిన లియాతక్ అలీ కొడుకు రమ్జాన్ అలీ కి ఇచ్చి పెళ్లి చేయాలనీ పెద్దలు నిశ్చయించుకున్నారు. దాని కోసమై ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు.

రమ్జాన్ అలీ ఉద్యోగరీత్యా దుబాయ్ లో ఉంటున్నాడు....
రమ్జాన్ అలీ ఉద్యోగరీత్యా దుబాయ్ లో ఉంటున్నాడు. అయితే వీసా సమస్యల వళ్ళ అనుకున్న ముహుర్తానికి ఇండియా కి రాలేకపోయాడు.

4జీ టెక్నాలజీ సాయం తీసుకున్నారు....
ఏంచేయాలో తెలియని ఇరు వర్గాల కుటుంబసభ్యులు 4జీ టెక్నాలజీ సాయం తీసుకున్నారు.ఇంక ఆలస్యం చేయకుండా బంధువులందరి సమక్షంలో వాళ్ళ నిఖా ని జరిపించేసారు.

నిఖా ఎలా జరిగిందంటే ...
నిఖా ఎలా జరిగిందంటే ... పెళ్లి కూతురు ఇండియాలో బంధువుల సమక్షంలో కూర్చుంది పెళ్ళికొడుకు దుబాయి నుంచి వీడియో కాల్ చేశాడు. ఇద్దరూ ఆన్లైన్లో ఉండగానే ముస్లిం మత పెద్దలు నిఖా చదివారు.మత పెద్దలు పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని మీకు ఈ పెళ్లి కి అంగీకారమే అని అడిగాకా వారు అంగీకారమే అనడంతో వీడియో కాల్ లో నిఖా ముగిసింది.


Click it and Unblock the Notifications